- అర్బన్ లోకల్ బాడీలతో ఎంపిక
- సీఎం చంద్రబాబు అభినందన
- మొదటి స్థానంలో విశాఖపట్నం
అమరావతి(చైతన్యరథం): పౌరసేవలను మరింత ప్రభావ వంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు సేవా-స్థాయి ఫలితాలను కొలిచే ఒక సరికొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తం గా ఉన్న అర్బన్ లోకల్ బాడీలు (యూఎల్బీలు) తొలుత కనీసం 10 వేర్వేరు సేవా ప్రమాణాల ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తాయి. ఆ ఫలితాల ఆధారంగా పనులు రూపొందిస్తారు. యూఎల్బీలలో సేవ లు అందించడం నిర్ణీత కాలపరిమితుల ప్రకారం నెరవేరేలా రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్కుమార్ కొత్త వ్యవస్థను రూపొందించారు. పౌరుల ఆకాంక్ష లను నెరవేర్చడానికి, పట్టణ సమస్యలను పరిష్కరించడంలో మొట్ట మొదటిసారిగా కేంద్రీకృత విధానాన్ని ఎంఏయూడీ శాఖ అవలం బిస్తోంది.
ప్రధాన సేవా-స్థాయి సూచికలు
యూఎల్బీలలో ప్రధాన సేవా-స్థాయి సూచికలలో ఇంటింటికీ నీటి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా, ఇంటింటికీ చెత్త సేకరణ, వ్యర్థాల ప్రాసెసింగ్, పాత వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి కాలువల నిర్మాణం, పక్కా రోడ్లు, (ఎల్ఈడీ) స్ట్రీట్ లైటింగ్, పట్టణ (మహిళా) స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆదాయం కలిగించే కార్యకలాపాలు, మున్సిపల్, రెవెన్యూ శాఖ ఉన్నాయి. పట్టణ సేవల సామర్థ్యాన్ని నిర్ధారించడంతో పాటు ఈ సరికొత్త వ్యవస్థ ఉత్తమ ఫలితాలను సాధించడానికి, సరైన వనరు ల వినియోగానికి తోడ్పడుతుంది.
సీఎం చంద్రబాబు అభినందన
ఈ కొత్త ర్యాంకింగ్ విధానాన్ని అభినందించిన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు సేవా-స్థాయి సూచికల గురించి ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ కార్పొ రేషన్ల కార్పొరేటర్లతో పాటు మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, కౌన్సిలర్లకు పూర్తి అవగాహన కల్పించాలని ఎంఏ యూడీ శాఖ అధికారులను ఆదేశించారు. యూఎల్బీలలోని ఎన్నికైన ప్రతి నిధులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ఈ దిశగా పని చేసి సేవా-స్థాయి సూచికలకు అనుగుణంగా ఉన్న పనులు మాత్రమే చేపట్టేలా చూడాలని కోరారు. ఎంఏయూడీ శాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయించిన కాలపరిమితులను ప్రశంసిస్తూ ప్రతిపాదిత పనులన్నీ నిర్ణీత కాలపరిమితుల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంఏయూడీ శాఖ ఇప్పటి సేవలు, అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడానికి రియల్-టైమ్ డాష్ బోర్డ్ను అభివృ ద్ధి చేస్తోంది. ఎంఏయూడీ శాఖ రంగాల వారీ సేవల ఆధారంగా మొదటి దశ ర్యాంకింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర సగటు ర్యాంకింగ్ (100 స్కేలులో) 66.3 శాతంగా ఉండగా విశాఖ పట్నం జిల్లా 74.4 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది, తరువాత ఎన్టీఆర్ 72.6 శాతంతో ఉంది. తిరుపతి (66.2 శాతం), గుంటూరు (64.9 శాతం), తూర్పు గోదావరి (64 శాతం), అనంతపురం (62 శాతం), వైఎస్ఆర్ కడప (61.7 శాతం), పల్నాడు (61.4 శాతం), అన్నమయ్య (60.4 శాతం) మరియు కర్నూలు (60.3 శాతం) సేవా-స్థాయి ర్యాంకింగ్లలో ఇతర టాప్ పర్ఫార్మర్లుగా నిలిచాయి. అనకాపల్లి జిల్లా 51.8 శాతం స్కోర్తో చార్ట్లో అట్టడుగున ఉంది.