అమరావతి (చైతన్యరథం): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. అద్భుత విజయం సాధించిన బీజేపీ నేతలకు, కార్యకర్తకలు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనా దక్షతకు ఈ గెలుపు నిదర్శనం. మోదీ సారథ్యంలో అప్రతిహతంగా విజయయాత్ర సాధిస్తున్న బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రచారం ఢిల్లీ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసింది. ప్రజాస్వామ్యంలో అభివృద్ధికి ఇచ్చే ప్రాధాన్యత ఢిల్లీలో బీజేపీ గెలుపుతో స్పష్టమైంది. ప్రజలు అవినీతిని ఎప్పటికీ సహించరని ఢిల్లీ ఎన్నికల్లో నిరూపించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో మెరుగైన పాలనతో ఢిల్లీలో మరింత అభివృద్ధి జరగాలని మంత్రి రవీంద్ర ఆకాంక్షించారు.