- వికసిత్ భారత్కు అనుగుణంగా స్వర్ణాంధ్ర సాధనకు అడుగులు
- టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం
- డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఏపీ
- 2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
- మోదీ అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సిందూర్ విజయం
- నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి బ్లూప్రింట్ ప్రజంటేషన్…
- ఇతర రాష్ట్రాలకు నమూనా అని ప్రశంసించిన ప్రధాని
ఢిల్లీ (చైతన్య రథం): స్వర్ణాంధ్ర విజన్ `2047లో భాగంగా 2029నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీ`4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామన్నారు. వికసిత్ భారత్`2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. ఢల్లీిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు.. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రెండవ, మూడవ శ్రేణి నగరాల అభివృద్ధివంటి అంశాలపై చర్చించారు.
పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ.. ఆపరేషన్ సిందూర్ను ప్రశంసిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలను తన ప్రజంటేషన్లో ప్రస్తావించారు. చంద్రబాబు ప్రజంటేషన్లోని వివిధ అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. చంద్రబాబు ప్రజంటేషన్కు సమావేశంలో పెద్దఎత్తున ప్రశంసలు దక్కాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రజంటేషన్లో చంద్రబాబు వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వెల్లడిరచారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను తాము ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనే విషయాన్ని తన ప్రజంటేషన్లో వివరించారు.
3వ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ
భారతదేశం ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే 3వ స్థానానికి వెళ్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా, జీఎస్టీ, స్టార్టప్ ఇండియా, పీఎం గతిశక్తి, జలజీవన్ మిషన్ వంటి జాతీయ సంస్కరణలు అభివృద్ధికి దోహదం చేశాయని వివరించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్దిని ఏపీ ప్రభుత్వం డిజిటల్గా ట్రాక్ చేస్తోందన్నార. వన్ ఫ్యామిలీ` వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్వయంఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా పాలసీలు తీసుకొచ్చామని, 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ డిస్ట్రిక్ట్ వన్ `పార్క్ను ప్రవేశపెడుతున్నామని సీఎం వివరించారు.
టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం
రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబు సమావేశంలో లేవనెత్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలో బయోమెడికల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ మార్గం వేస్తోందన్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంను అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ మోడల్ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కోరారు. డిజిటల్ గవర్నెన్స్లో గూగుల్ ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్ బుక్ క్రియేట్ చేస్తున్నామని వివరించారు. టాటా ఇన్నొవేషన్ హబ్, ఏఐ ఆధారిత పాలన ద్వారా రాష్ట్రం స్టార్టప్లకు, ఉద్యోగ సృష్టికి మార్గదర్శకంగా మారిందని అభిప్రాయపడ్డారు. సర్క్యులర్ ఎకానమీ, అభివృద్ధి వికేంద్రీకరణ, మిషన్ కర్మయోగి వంటి కార్యక్రమాల ద్వారా సమగ్రాభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ సాధిస్తోందని సీఎం చంద్రబాబు వివరించారు.
జీడీపీ, పాపులేషన్ మేనేజ్మెంట్, టెక్నాలజీ చర్చ
రాష్ట్రాభివృద్ధికి ఉపకరించే మూడు కీలక అంశాల గురించి సీఎం చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు, ఉద్యోగ సృష్టివంటి అంశాలపై దృష్టిపెట్టి, పీపీపీ ప్రాజెక్టులకు కేంద్రం వయబిలిటీ గ్యాఫ్ ఫండిరగ్కు మద్దతుగా ఉండటం ద్వారా జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు జనాభా లేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని, తద్వారా అభివృద్ధిపై ప్రభావంపడే అవకాశం ఉందన్నారు. కానీ భారతదేశానికి ఉన్న జనాభా కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా దేశంలో వృద్దుల శాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఉద్దేశంతోనే స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు, మాతృత్వ సెలవులు పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అదేవిధంగా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంతో పాలనలో వేగం పెంచడమే కాకుండా, పౌర సేవలను విస్తృతం చేయోచ్చని చంద్రబాబు అన్నారు.
డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఏపీ ఆదర్శం
స్వర్ణాంధ్ర విజన్`2047 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో జాతీయాభివృద్ధికి దోహదపడేలా ఆదర్శంగా నిలుస్తుందని సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా… మార్గదర్శకత్వం వహించేలా ఏపీ ముందుండి నడవడానికి సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.
సంక్షోభ సమయంలో ధైర్యంగా నిలిచారు
ఏప్రిల్ 22న ఫహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమాయకులకు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు, సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైందని కొనియాడారు. యుద్ధ వాతావరణం నెలకొన్న సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ ధైర్యంగా నాయకత్వం వహించారని సీఎం ప్రశంసించారు.
సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్పై పీఎం ప్రశంసలు
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. దీనిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని, సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.