- సన్మాన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర
- తనకు కీలక బాధ్యతలు అప్పగించారని సీఎం చంద్రబాబుకు సుగుణమ్మ కృతజ్ఞతలు
విజయవాడ (చైతన్యరథం): పార్టీ కోసం కష్టపడిన నేతలకు పదవులు వెతుక్కుంటూ వస్తాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ ప్రమాణ స్వీకార వేడుకలు విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఏర్పాటు చేశారు.. ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనడానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేటీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ అన్నారు. సుగుణమ్మ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకుంటున్నానన్నారు. కూటమి పొత్తులో భాగంగా సీటు కోల్పోయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించిన కూటమి అభ్యర్థిని గెలిపించడంలో సుగుణమ్మ అత్యంత కీలకంగా వ్యవహరించారన్నారు. గతంలో శాసనసభ్యురాలిగా తిరుపతి ప్రజలకు సేవలు అందించారన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు.. రాష్ట్రంలో పచ్చదనంగా పెంచేందుకు సుగుణమ్మ చర్యలు తీసుకోవాలన్నారు.. ఆమె పర్యవేక్షణలో పరిశుభ్రత, పచ్చదనంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు.
సన్మాన వేడుకలో మన్నూరు సుగుణమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పదవి ఇచ్చి తనకు గురుతర బాధ్యతను అప్పగించారన్నారు. తనకు ఇచ్చిన పదవికి సంపూర్ణ న్యాయం చేసేందుకు నూటికి నూరు శాతం చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. రాజధాని అమరావతిని పచ్చదనం తో నింపేందుకు తన వంతు కష్టపడి పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు, ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని కాపాడుకుని పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పచ్చదనాన్ని కాపాడుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నారు. తనను ప్రత్యేకంగా గుర్తించి ఈ పదవి ఇచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గౌరవాన్ని కల్గించారన్నారు. సుందర, వికసిత్ ఆంధ్రప్రదేశ్గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానన్నారు. తనకు కిచ్చిన ఈ బాధ్యతను నూటికి నూరు శాతం నెరవేర్చుతానన్నారు. పదవికి తప్పని సరిగా న్యాయం చేస్తానని తెలియజేశారు.
మన్నూరు సుగుణమ్మను ఘనంగా సన్మానించిన వారిలో శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని, శ్రావణి, ఎమ్మెల్సీ గ్రీష్మ, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఐలాపురం వెంకయ్య, తదితరులు ఉన్నారు.
అభినందించిన పార్టీ నేతలు
ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్గా తిరుపతి మాజీ శాసన సభ్యురాలు ఎమ్.సుగుణమ్మ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ అయోధ్యనగర్లోని గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు, తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జి.నర్సింహ యాదవ్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సుగుణమ్మకు శుభాభినందనలు తెలియజశారు.