- లంచం తీసుకున్నట్లు ఏసీబీ నిర్ధారణ
- జైలుశిక్ష నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు
అమరావతి(చైతన్యరథం): గతంలో కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి(డీఎంహెచ్వో)గా పనిచేస్తూ రూ.30,000 లంచం తీసు కుంటూ ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో నేడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 2017లో ఆ అధికారి ఒక ప్రైవేట్ ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్ సేవల కొనసాగింపునకు (రెన్యువల్) లంచం అడిగినట్లు సమాచారం అందడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నా రు. ఈ విషయంలో 2019లో కేసు నమోదు చేసింది. కర్నూలు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గత నెల ఇచ్చిన తీర్పులో సదరు వైద్యాధికారి లంచం తీసుకున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2020లో పదవీ విరమణ చేసిన సదరు అధికారికి పింఛను, గ్రాట్యుటీ చెల్లింపులను తక్షణమే నిలిపివేయాలని వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఆదేశాలిచ్చారు. నియ మాల ప్రకారం ఆ అధికారికి పింఛను మొత్తంలో 75 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. మంత్రి ఆదేశాలతో ఈ నెల నుంచి పెన్షన్ చెల్లింపును నిలిపివేస్తారు. సవరించిన పెన్షన్ నిబంధనలు, 1980 ప్రకారం ముడుపుల కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన వారికి పింఛను, గ్రాట్యుటీ చెల్లింపులు ఉండవు. ఈ కేసులో ఆయనకు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రస్తుత నియమాల ప్రకారం 62 ఏళ్లకు పదవీ విరమణ చేసిన డీఎంహెచ్ ఓలకు జీవితకాలం నెలకు సుమారు రూ.1,00,000కు పైగా పెన్షన్ పొందే అవకాశముంది. దీంతోపాటు సుమారు రూ.20 లక్షలు గ్రాట్యుటీ అందుతుంది. రూ.30,000 లంచానికి ఆశపడి న సదరు కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి ఈ మొత్తాన్ని కోల్పోయే పరిస్థితి ఎదురైంది.