- సమస్యలు పరిష్కరించి సంస్కరణలు తెచ్చాం
- పాఠశాలల్లో చక్కటి వాతావరణం సృష్టించాం
- విద్యాసంవత్సరం ఆరంభంలో మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
అమరావతి (చైతన్యరథం): విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది, అధికారులు, విద్యాశాఖ యంత్రాంగానికి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడుతూ, పాడుతూ చదువుకునేందుకు పాఠశాలల్లో అద్భుతమైన వాతావరణం సృష్టించామన్నారు. విద్యా సంవత్సరం బడి గంట మోగేసరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులందరికీ సరికొత్త యూనిఫామ్, పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగు అందజేస్తున్నాం. ఆకలి వేస్తే మధ్యాహ్నానికి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం రేపే ఆరంభిస్తున్నాం. సమస్యలు పరిష్కరించాం. సంస్కరణలు ఆరంభించాం. బాలలే మన ప్రపంచం. వారి చదువే మనకు గీటురాయి. ఉపాధ్యాయులే మనకు దిక్సూచి. పిల్లల బంగారు భవితకు బాటలు వేద్దామని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.