- సమన్వయంతో జిల్లా అభివృద్ధి పథం
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
- మహిళలకు చెక్కులు, రైతులకు యంత్రాలు
- పాల్లొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి
పార్వతీపురం మన్యం జిల్లా(చైతన్యరథం): సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి, మన్యం జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తదితరు లు పాల్గొన్నారు. అంతకుముందు పాలకొండ కూటమి నేతలు పి.భూదేవమ్మ, రామినాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ సం దర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా సమగ్రాభి వృద్ధికి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళదా మని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో జిల్లా ద్వితీయ స్థానంలో ఉండ డం సంతోషంగా ఉందన్నారు. పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శ్రీనిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.49.75 కోట్లు రుణం మం జూరు చేయగా అందుకు సంబంధించి చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.
మహిళల అభివృద్ధి, కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుం దని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు అందజేశారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు అధికంగా ఉందని, పండిరచిన పంటలకు మంచి ధర రావాలంటే పంటలో క్వాలిటీ మెరుగ్గా ఉండాలన్నారు. అటవీ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. పాలకొండ ప్రాం తంలో పైనాపిల్ పంట అధికంగా సాగు చేస్తున్నందున బై ప్రొడక్ట్స్ తీసుకురావాల్సిన అవసరం గుర్తించామని తెలిపారు. ఫుడ్ ప్రాసె సింగ్ యూనిట్లు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గిరిజన ప్రాంతంలో రహదారు ల ఏర్పాటుకు ప్రత్యేకత చర్యలు చేపడుతున్నామని అన్నారు. జం జావతి ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడేలా 15,000 ఎకరాలకు సాగునీరు అందించేలా ఒరిస్సా గవర్నమెంట్తో చర్చించేందుకు శ్రద్ధ చూపుతామని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధి కారులు అశుతోష్ శ్రీవాస్తవ్, సి.యశ్వంత్కుమార్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పాల్గొన్నారు.