- ఛాయవాలా దేశ ప్రధాని అయ్యారంటే రాజ్యాంగమే కారణం
- దేశాభివృద్ధికి జస్టిస్ గవాయ్ వంటి వారి గైడెన్స్ అవసరం
- 75 ఏళ్ల రాజ్యాంగంపై సదస్సులో సీఎం చంద్రబాబు
- సదస్సుకు హాజరైన సీజేఐ గవాయ్, ఏపీ సీజే రాకూర్
- ఏపీ హైకోర్ అడ్యకేట్. అసోసియేషన్ ఆధ్వర్యంలో సదసు.
అమరావతి (చైతన్య రథం): భారతదేశ ప్రతి పౌరుడి ఆలోచనా విధానం ‘నేషన్ ఫస్ట్’కు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండే సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కన్పిస్తోందని… ఈ రకమైన సమానత్వాన్ని సాధించడానికి పబ్లిక్ పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. భారత రాజ్యాంగం అమల్లోక్ వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆదివారం సీకే కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయవాదుల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిన్ బీఆర్ గవాయ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ తోపాటు సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ఛాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన నరేంద్రమోడీ దేశ ప్రధానిగా ఉన్నారంటే.. అందుకు భారత రాజ్యాంగం గొప్పతనమే కారణమన్నారు. ఇలాంటి సందర్భంలో అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని వివరించారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించేది న్యాయవ్యవస్థే
సమాజంలో ఏమైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని రక్షించేది న్యాయ వ్యవస్థేనని ముఖ్యమంత్రి అన్నారు. ‘సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ ఎడిటర్లు అయిపోతున్నారు. ఆ ముసుగులో వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘వన్ పర్సన్.. వన్ ఓట్.. అనేది అంబేద్కర్ ఇచ్చిన వరం. కొన్ని దేశాల్లోని ఓటర్లకు సమాన హక్కులు ఉండవు. ఓటు హక్కు విషయంలో పేద ధనిక, లింగ బేధాలులేని దేశంగా భారత్ మాత్రమే’నని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓటు విషయంలో ఇంకా పేద ధనిక తారతమ్యాలు ఉన్నాయని… ఈ అంతరాలను తగ్గించేలా అందరూ ఆలోచన చేయాలని సీఎం సూచించారు. అందరికీ సమాన అవకాశాలు కలిగేలా చేయగలిగితే… ఈ తారతమ్యాలు మాయమవుతాయని అభిప్రాయపడ్డారు. ‘అందుకే మేము హెల్దీ, వెల్డీ, హ్యాపీ సొసైటీ రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం. దీనికి అందరినుంచి సహకారాన్ని కోరుతున్నాం’ అని సీఎం పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కూడా వసుదైక కుటుంబం గురించే మాట్లాడతారని… ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కర్నీ మన కుటుంబసభ్యులుగానే భావించాలని.. వసుదైక కుటుంబం భావన ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఒకరి సార్వభౌధికారంలో వేరేవారు జోక్యం చేసుకోకుండా పరిధులు దాటకుండా ఉండాలని… ఈ విధానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా -కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
గవాయ్ లాంటి వ్యక్తులు గైడ్ చేస్తూనే ఉండాలి
జస్టిస్ బీఆర్ గవాయ్ సీజేఐ స్థాయిలోఉన్నా… సింపుల్గా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. సమానవత్వానికి సీజేఐ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని… మంచి మనస్సున్న వ్యక్తి జస్టిస్ గవాయ్ అన్నారు. తన విధి నిర్వహణలో గవాయ్. మంచి తీర్పులు ఇచ్చారని… ప్రజలంతా ఆ తీర్పులు గుర్తు పెట్టుకునేలా ఉంటాయని చంద్రబాబు అన్నారు. గవాయ్ లాంటి వారు దేశాభివృద్ధికి నిరంతరం గైడ్ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు. ‘అమరావతిలో ఈ సదస్సు జరుగుతోంది. సీజేఐ బీఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతినుంచే వచ్చారు’ అని సీఎం చంద్రబాబు అంటూ.. “నేను సీఎంగా, సీజేఐగా గవాయ్, ఏపీ సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్.. మా విధులను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
దేశంలో పెద్దఎత్తున మానవ వనరులు
ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రజల ఆలోచనా విధానం మారిందని.. పరిస్థితులు కూడా మారుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. చాలా దేశాలు యువతలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. కానీ భారత దేశానికి అలాంటి సమస్య లేదన్నారు. మన దేశంలో పెద్దఎత్తున మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని.. భారత దేశాన్ని ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలిపేలా ప్రధాని పని చేస్తున్నారని స్పష్టం చేశారు. 2047నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రభావం చూపే స్థాయికి చేరుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐటీని ప్రమోట్ చేయాలనే విధాన నిర్ణయం తీసుకున్నామని… హైదరాబాద్ అభివృద్ధే దానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.














