- అమెరికాలో ప్రవాసాంధ్రుల నివాళి
- మినీ మహానాడు, జయంతి వేడుకలు
- లోకేష్కు బాధ్యతలు అప్పగించాలని తీర్మానం
అమెరికా: వాషింగ్టన్ డీసీలోని వర్జీనియాలో ఎన్టీఆర్ 102వ జయంతి, సినీ వజ్రోత్సవా లను పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మినీ మహానాడు వేడుకలు నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలను అనుసరించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్యఅతిథిగా పాల్గొనగా భానుప్రకాశ్ మాగులూరి సమన్వయకర్తగా వ్యవహరించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు పార్టీ బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగించాలని ఈ ప్రవా సాంధ్రులు తీర్మానం చేశారు. అనంతరం ఎన్టీఆర్పై రూపొందించిన పోస్టర్ను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ అందనంత ఎత్తుకు ఎదిగారు. తెలుగుజాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో, జన హృద యాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయులు. ఆయన కీర్తి అజరామరం. తెలుగుదేశం ఒక ప్రయో గశాల. నాయకులను, కార్యకర్తలను తయారుచేసే కార్ఖాన. పార్టీలో కోటిమంది సభ్యుల ను చేర్చడం ద్వారా లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించు కున్నారు. అటు పార్టీపై, ఇటు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వాన్ని పుణికిపు చ్చుకుని లోకేష్ అందనంత ఎత్తుకు ఎదిగారు. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించేం దుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. భాను మాగులూరి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పార్టీని తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు చంద్రబాబు, లోకేష్ దార్శనిక నాయకత్వంలో ప్రపం చ సాంకేతిక రంగ వేదికపై తెలుగు యువతకు శాశ్వత వారసత్వాన్ని అందించారన్నారు. అనంతరం భాను మాగులూరిని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్ పార్టీ ప్రతినిధి రాజా రావులపల్లి, కిషోర్ కంచర్ల, రమేష్ అవిరినేని, చక్రవర్తి, సీతారామారావు, రఘు, హనుమంతరావు, కె.వి.రావు, విజయభాస్కర్, రామకృష్ణారెడ్డి, చంద్రనాథ్, రమేష్, లోకేంద్ర ప్రసాద్, యాదగిరి, చిట్టెల సుబ్బారావు, సత్తిబాబు, సుబ్ర హ్మణ్యం, మాల్యాద్రి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.