- వచ్చే ఎన్నికల నాటికి తగ్గింపే లక్ష్యం
- నెంబర్వన్ శిక్షణ కేంద్రంగా ఈసీబీసీ
- నాణ్యమైన గ్రీన్ ఎనర్జీ అందిస్తాం
- విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
- ఎనర్జీ కన్జర్వేషన్ భవనం ప్రారంభం
విశాఖపట్నం(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ యాలకు అనుగుణంగా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీఈపీ డీసీ ఎల్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మిం చిన సూపర్ ఈసీబీసీ(ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్) భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. విద్యుత్ ఉద్యోగుల శిక్షణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన సూపర్ ఈసీబీసీ భవనం దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈసీ బీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన ఈ భవనం ద్వారా సుమారు 40 శాతంపైగా విద్యుత్ ఆదా అవుతుండటం ఆదర్శప్రా యమని కొనియాడారు. విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాలతో విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియా మక పత్రాలు అందజేశారు. ఈపీడీసీఎల్ పరిధిలోని సుమారు 20 మందికి సంస్థలో ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబాలు ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా వీలైనంత తక్కువ రోజుల్లోనే నియామక పత్రాలు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13 నెలల్లో సుమారు 180 మందికి నియామక పత్రాలు అందజేసి నట్లు తెలిపారు. విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన సిబ్బందికి కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు. 24 గంటలూ నాణ్యమైన గ్రీన్ ఎనర్జీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించే లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో 20 లక్షల సోలార్ విద్యుత్ కనెక్షన్లను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ కనీ సం 10 వేల సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్న ట్లు వెల్లడిరచారు. అదేవిధంగా పీఎం కుసుమ్ పథకంలో భాగంగా వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చారు. దీనితో పాటు రాష్ట్రం లోని మూడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ కనెక్షన్లను అనుసంధానించే ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ ఈ కేంద్రాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిపేలా, ప్రభా వవంతంగా ఉపయోగపడేలా ఒక గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయా లన్న ప్రతిపాదనను తెలిపారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. కుసుం పథకం కింద 3 లక్షల వ్యవసాయ సౌర పంపుల కనెక్షన్లను కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, 20 లక్షల ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర రూఫ్టాప్ ఏర్పాటు చేస్తామని, బీసీలకు అదనంగా రూ.20,000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 సౌర రూఫ్ టాప్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యుత్ అవసరమని చెప్పారు. ఎంపీ ఎం.భరత్ రూఫ్ టాప్ సోలార్ అమలును వేగవంతం చేయాలని కోరుతూ ఈసీబీసీ భవనాన్ని విజయవంతంగా నిర్మించి న ఏపీఈపీడీసీఎల్ సిబ్బందిని అభినందించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ విజయానంద్, సీఎండీ ఫృథ్వీతేజ ఇమ్మడి పెద వాల్తేరులో ఏర్పాటు చేసిన స్కాడా భవ నాన్ని, విశాఖ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను సందర్శించి మొక్క లు నాటారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ వీ.చిరంజీవిరావు, ఏపీఈపీ డీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ పాల్గొన్నారు.