- ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే వారి భద్రత ముఖ్యం
- మల్లంలో సురేష్ మరణం తనను కలచి వేసింది
- అందుకే ఎలక్ట్రీషియన్లకు రక్షణ కిట్లు పంపిణీ
- సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్
మంగళగిరి(చైతన్యరథం): ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ, భద్రత చాలా ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకోసారి జాబ్మేళా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఉదయం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషి యన్లతో సమావేశమయ్యారు. పని ప్రదేశాల్లో వారి రక్షణ, భద్రత కోసం సొంత నిధుల తో సేఫ్టీ కిట్లను అందజేశారు. ఈ సేఫ్టీ కిట్లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్ కిట్, రబ్బర్ హాండ్ గ్లోవ్స్, షూస్, జాకెట్ ఉన్నాయి. ఈ సందర్భంగా పవన్కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘గత ఏప్రిల్లో పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఎలక్ట్రీషి యన్గా పనిచేసే దళిత యువకుడు పల్లపు సురేష్ ప్రమాదవశాత్తూ మరణించడం చాలా కలచి వేసింది. అందుకే రక్షణ, భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సురేష్ మరణం వెనుకనున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే రెండు అంశాలు స్పష్ట మయ్యాయి. ఒకటి ఆయన పేదరికం..విద్యుత్ పనులు చేసేటప్పుడు వాడే రక్షణ పరికరాలు ఆయన దగ్గర లేకపోవడంతో మరణించారు. రెండవది ప్రమాదవశాత్తు ఆయన చనిపోతే అతని కుటుంబానికి ఆదుకునేందుకు సరైన ఆర్థిక భద్రత లేకపోవడం. ఇటువంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకూడదనే నిశ్చయంతో పిఠాపురం నియో జకవర్గంలో ఉన్న 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు రక్షణ పరికరాల కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. రక్షణ పరికరాలను తప్పనిసరిగా వాడాలి..పని ప్రదేశంలో విద్యుత్ షాక్తో మరొకరు చనిపోకూడదని సూచించారు. రక్షణ ఏర్పాట్లు చేసినా ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంటే కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ద్వారా రూ.2 లక్షలు, చంద్రన్న బీమా ద్వారా మరో రూ.2 లక్షలు అందించే ఏర్పాట్లు చేశాం. గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తంగా మార్చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించింది. వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని తెలిపారు.
పదేళ్ల నుంచి ఉన్న జీవోను సవరించారు: కృష్ణతేజ
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ మాట్లాడుతూ ‘‘మూడునెలల క్రితం ఆటో ఢీకొని ముగ్గురు ఉపాధి శ్రామికులు మరణించారు. వారికి ప్రభుత్వ జీవో ప్రకారం చెరో రూ.50 వేలు పరిహారం అందించాం. ఈ విషయం తెలుసుకున్న పవన్కళ్యాణ్ పదేళ్లుగా కొనసాగుతున్న జీవోను సవరించి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం అందేలా చేశారు. అలాగే రూ.2 లక్షలు సరిపోవని భావించి వారంరోజుల పాటు ఒక డ్రైవ్లా కోటి మంది ఉపాధి శ్రామికులకు ఇన్సూరెన్స్ చేయించారు. భవిష్యత్తులో ఉపాధి శ్రామికులు ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి రూ.4 లక్షలు పరి హారం అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహ న్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్మికులకు ప్రైవేటు ఇన్సూరెన్స్ లేకపోయినా ఈ బోర్డు నుంచి పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోందన్నారు. అలాగే ఈ రంగంలో పనిచేసే యువతకు ప్రత్యేకంగా జాబ్మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు.