- సోషల్ మీడియా బాధ్యతగా వ్యవహరించాలి
- ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే అవకాశం
- సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధం ఉంది
- హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి (చైతన్యరథం): మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని హెూంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇలాంటి సమ యంలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు ఆస్కారం ఇవ్వొద్దని ఒక ప్రకటనలో కోరారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ హెచ్చరిక వచ్చినప్పటి నుంచి సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలెర్ట్ అయిందని… గత మూడురోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్, తాను ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు నిర్వహించి అన్ని విభాగాలను అలెర్ట్ చేశామని.. యం త్రాంగాన్ని సిద్ధం చేశామని చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతా ల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా వివిధ శాఖలకు చెందిన ఉద్యో గులందరూ సమన్వయంతో పనిచేయడానికి అవసరమైన ప్రణాళి కను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు.
జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియామకంతో పాటు.. తుఫాను సహాయక చర్యల కు అవసరమైన నిధులను విడుదల చేశారని వివరించారు. అలాగే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం చే వేస్తోందని పేర్కొన్నారు. తుఫాన్పై సోషల్ మీడియా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలిందని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని యూట్యూబ్ చానళ్లు, డిజిటిల్ మీడియా సంస్థలు పెట్టే థంబ్ నెయిల్స్ ప్రజలను భయపెట్టేలా ఉంటున్నా యని అన్నారు. ఈ మేరకు ఆర్టీజీ సెంటర్ నుంచి తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. సంచలనాల కోసం ఇలా చేస్తే ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలకు సమాచారం చేరవేడంలో అత్యంత కీలకమైన పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా బాధ్యతగా ప్రజలకు వాస్తవ సమాచారం చేరవేయాలని తెలిపారు.














