విశాఖపట్నం (చైతన్య రథం): రాష్ట్ర విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో 84వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాలనుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చి వినతిపత్రాలు అందజేశారు. తమకు వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్రా యూనివర్సిటీ మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు కోరారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ కేలండర్లో విద్యుత్ శాఖ ఏఈఈ, జెఎలఎం పోస్టులను కూడా కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని పలువురు అభ్యర్థులు విన్నవించారు. కొత్తగా ప్రారంభించబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తమ సేవలను ఉపయోగించు కోవాలని విశాఖ ఎయిర్ పోర్టు పోర్టర్లు వినతిపత్రం సమర్పించారు.
















