- విజన్ డాక్యుమెంట్లో కీలకమని వెల్లడి
అమరావతి(చైతన్యరథం): జైపూర్లో మంగళవారం జరిగిన 12వ ఆసియా పసిఫి క్ రీజినల్ సర్కులర్ ఎకానమీ ఫోరం అంతర్జాతీయ సదస్సులో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీకృత వ్యర్ధాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంస్కర ణలపై సదస్సులో చర్చ జరిగింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భూపేంద్ర యాదవ్తో కలిసి సదస్సులోని వివిధ దేశాల పెవిలియన్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఏపీ విజన్పై సదస్సులో ప్రసంగించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలనేది లక్ష్యం.
స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్చాంధ్ర టార్గెట్తో ముందుకెళుతున్నాం. స్వచ్ఛాంధ్ర అనేది 2047 విజన్ డాక్యుమెంట్లో కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. పరిశుభ్రత, పర్యావరణ సమ తుల్యత, సమగ్ర ఆర్థిక వ్యవస్థ స్వచ్ఛాంధ్ర లక్ష్యాలు వివరించారు. వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, వాతావరణ పరిస్థితులు సమతుల్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. 2047 నాటికి జీరో వేస్ట్ క్లైమేట్ రెసిడెన్స్ సాధించేందుకు ఏపీ కట్టు బడి ఉందని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలో ఉత్తమ పద్ధతులతో ఆకట్టుకునేలా సర్కులర్ ఎకానమీ దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వివరించారు. స్వచ్ఛాం ధ్ర అనేది కేవలం పరిశుభ్రత మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాలకు నీరు, భూమిని పరి రక్షించాలనేదే లక్ష్యమని వివరించారు.