అమరావతి (చైతన్యరథం): అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విషాదకరమైన ప్రమాదానికి గురికావడం చాలా బాధాకరమన్నారు. దీంతో తీవ్ర విచారానికి గురయ్యానన్నారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ వినాశకరమైన ఘటనలో ప్రభావితమైన వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. త్వరితగతిన రక్షణ, ఉపశమన చర్యలు చేపట్టాలని, ప్రమాద కారణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మంత్రి లోకేష్ కోరారు.