అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ సభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్ (యర్రగొండపాలెం), ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), రేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు) పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సోమవారం సమాధానమిచ్చారు. ఇదిలావుండగా… గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదు. గత 30ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డీఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-19 నడుమ చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014, 18, 19ల్లో మూడు డీఎస్సీల నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసింది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి.