- మంత్రి కొల్లు రవీంద్రకు యువనేత లోకేష్ అభినందనలు
- ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిచ్చేలా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు కనీవీనీ ఎరుగని రీతిలో మసులా బీచ్ ఫెస్ట్-2025 నిర్వహణకు శ్రీకారం చుట్టిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్ట్గా మసూలా బీచ్ ఫెస్ట్ను తీర్చిదిద్దేందుకు మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న కృషి ఆదర్శనీయమన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా యువతకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. కొల్లు రవీంద్ర స్ఫూర్తితో తీరప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఇతర ఎమ్మెల్యేలు కృషిచేయాలని కోరుతున్నా. పండుగ వాతావరణంలో జరుగనున్న మసులా బీచ్ ఫెస్ట్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.