* సీఐఐ భాగస్వామ్య సదస్సు లక్ష్యమిదేనన్న మంత్రి లోకేష్
* పెట్టుబడుల ఆకర్షణకు దేశ విదేశాల్లో రోడ్ షోలు
* సదస్సు నిర్వహణపై కేబినెట్ సబ్కమిటీ తొలి సమీక్ష
* వేదికగా విశాఖ ఏయూ గ్రౌండ్స్ను ఖరారు చేసిన ఉపసంఘం
ఉండవల్లి (చైతన్య రథం): ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనేలా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025ను సమన్వయం చేసేందుకు ఏర్పాటు
చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో ఉండవల్లి నివాసంలో తొలి సమీక్ష నిర్వహిం చారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణకు చేపట్టనున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఉప సంఘం చైర్మన్, మంత్రి నారా లోకేష్ మాట్లా డుతూ ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనేవిధంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాల న్నారు. ప్రపంచ నలుమూలల నుంచీ పెట్టు బడులు ఆకర్షించేలా సదస్సును విజయ వంతం చేయాలని సూచించారు. తద్వారా ఏపీలో ఉపాధి, ఆర్థికరంగవృద్ధి జరుగుతుంది. ఒక్కో దేశానికి సంబంధించిన ఒక్కో థీమ్ను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి
లోకేష్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి.. పారిశ్రామికవేత్తలకు ఏపీని కేంద్రంగా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. సదస్సుకు విశాఖ ఏయూ గ్రౌండ్ను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఖరారు చేశారు. ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్: నేవిగేటింగ్ ది న్యూ జియో ఎకనమిక్ ఆర్డర్’ థీమ్ సదస్సును సీఐఐ భాగ స్వామ్యంతో నిర్వహించనున్నారు. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమా వేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమీక్ష లో మంత్రులు టీజీ భరత్, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండ పల్లి శ్రీనివాస్ తో పాటు సీఎస్ కె విజయా నంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
* సీఐఐ భాగస్వామ్య సదస్సు లక్ష్యమిదేనన్న మంత్రి లోకేష్
* పెట్టుబడుల ఆకర్షణకు దేశ విదేశాల్లో రోడ్ షోలు
* సదస్సు నిర్వహణపై కేబినెట్ సబ్కమిటీ తొలి సమీక్ష
* వేదికగా విశాఖ ఏయూ గ్రౌండ్స్ను ఖరారు చేసిన ఉపసంఘం
ఉండవల్లి (చైతన్య రథం): ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనేలా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025ను సమన్వయం చేసేందుకు ఏర్పాటు
చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో ఉండవల్లి నివాసంలో తొలి సమీక్ష నిర్వహిం చారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణకు చేపట్టనున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఉప సంఘం చైర్మన్, మంత్రి నారా లోకేష్ మాట్లా డుతూ ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనేవిధంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాల న్నారు. ప్రపంచ నలుమూలల నుంచీ పెట్టు బడులు ఆకర్షించేలా సదస్సును విజయ వంతం చేయాలని సూచించారు. తద్వారా ఏపీలో ఉపాధి, ఆర్థికరంగవృద్ధి జరుగుతుంది. ఒక్కో దేశానికి సంబంధించిన ఒక్కో థీమ్ను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి
లోకేష్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి.. పారిశ్రామికవేత్తలకు ఏపీని కేంద్రంగా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. సదస్సుకు విశాఖ ఏయూ గ్రౌండ్ను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఖరారు చేశారు. ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్: నేవిగేటింగ్ ది న్యూ జియో ఎకనమిక్ ఆర్డర్’ థీమ్ సదస్సును సీఐఐ భాగ స్వామ్యంతో నిర్వహించనున్నారు. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమా వేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమీక్ష లో మంత్రులు టీజీ భరత్, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండ పల్లి శ్రీనివాస్ తో పాటు సీఎస్ కె విజయా నంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.