యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసలు
అమరావతి(చైతన్యరథం): కేంద్ర సాహిత్య యువపురస్కారం అందుకున్న యువ రచయిత సూరాడ ప్రసాద్కు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం మత్స్యకార గ్రామం వాడరాంబిల్లికి చెందిన రచయిత ప్రసాద్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో అద్భుతమైన రచనలు రాశారని, తన రెండో నవలకే ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు. మత్స్యకార గ్రామం నుంచి ఎదిగిన ప్రసాద్ తన నవలా రచనలతో యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.