- అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు భూసమీకరణ
- రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు..
- పలు సంస్థలకు భూ కేటాయింపులు
- పురపాలకశాఖలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల అప్గ్రేడ్
- మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
- టెన్నిస్ ఆటగాడు సాకేత్కు స్పోర్ట్స్ కోటాలో గ్రూప్`1 జాబ్
- శ్రీశైలం డ్యామ్, కాటన్ బ్యారేజీ సేఫ్టీకి రూ.350 కోట్లతో పనులు
- తెలుగు రాష్ట్రాల ప్రయోజనకారిగా పోలవరం`బనకచర్ల ప్రాజెక్టు
- అమరావతిలో అన్ని హంగులతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం
- ఎస్ఐపీబీ సమావేశ ప్రతిపాదనలకు క్లియరెన్స్
- 4687 మినీ అంగన్వాడీ కేంద్రాల అప్ గ్రేడ్
- మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలుకు రూ.273.17 కోట్లు మంజూరు
- వచ్చే ఏడాది పొగాకు సాగుకు క్రాప్ హాలిడే
అమరావతి (చైతన్య రథం): రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. ప్రపంచస్థాయి సంస్థలను, విద్యను, వైద్యాన్ని, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. యూనిఫార్ము ప్రేమ్ వర్కుతో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించిందన్నారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటర్ బాడీస్ను పరిరక్షించే విధంగా నిబంధనలను రూపొందించామన్నారు. ఎటువంటి వివాదాలకు తావులేకుండా ల్యాండ్ పూలింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతోపాటు.. రైతులకు మెరుగైన ప్యాకేజీ అందించేలా కేబినెట్ నిర్ణయించిందన్నారు. అసైన్డ్, దేవాదాయ, లంక భూములపై జేసీతో దర్యాప్తు చేయిస్తామని, సర్వే సమయంలో సరిహద్దులవద్ద సమస్యలు రాకుండా చూస్తామన్నారు.
స్థానిక రైతులకు ఉచిత విద్య, వైద్య చికిత్స అందిస్తామని, గతంలో పునాదులు పూర్తయిన భవనాలు తొలుత పూర్తి చేస్తాం. టెండర్లు దక్కించుకున్న జీఏడీ, హెచ్వోడీ టవర్లను ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్ పల్లోంజీ సంస్థకు అప్పగిస్తాం. సీఆర్డీఏ సమావేశ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది’’ అని పార్థసారథి వివరించారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలోని 64 బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల అప్గ్రేడ్, 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల మంజూరీ కోరుతూ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందన్నారు. అలాగే, రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో రూ.447 లక్షల అంచనా వ్యయంతో 7 కొత్త అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికిÑ కుప్పం, ఏపీ హైకోర్టులో ఇప్పటికే నిర్వహిస్తోన్న రెండు అన్న క్యాంటీన్ల ధృవీకరించేందుకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణ చట్టంలో నిబంధనల సవరిస్తూ, సులువుగా అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సవరణ తెచ్చామని, దీంతో రాష్ట్రంలో నిర్మాణ రంగం మరింత ఊపు అందుకుంటుందని మంత్రి కొలుసు వివరించారు. రాష్ట్రానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్సాయి మైనేని 2014లో దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాన్ని, పురుషుల డబుల్స్లో రజత పతకాన్ని సాధించారు.
అలాగే 2016, 2019లో జరిగిన ఆసియా క్రీడల్లో 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలను సాధించారు. 15 అంతర్జాతీయ ఛాలెంజర్ టైటిల్స్, 28 అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ సాధించిన సాకేత్ సాయి అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 2017లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు ప్రదానం చేశారు. భారతదేశానికి, రాష్ట్రానికి క్రీడారంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా సాకేత్ సాయిని రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్గా నియమించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఓకే చెప్పింది. టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ నిర్ణయించింది. తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ చేసేందుకు రెవిన్యూ (భూములు) శాఖ రూపొందించిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నెలటూరులో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాల కోసం సెంబ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్కు 1.13 కోట్ల చెల్లింపుపై బదిలీ చేయడానికి కేబినెట్ ఓకె చెప్పింది. అలాగే, శ్రీకాకుళం జిల్లా గూడెం గ్రామంలో 1.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎస్ఏపీఎల్ పైప్లైన్ రిసీవింగ్ టెర్మినల్ కొత్త భవనం నిర్మాణానికి రూ.1.10 కోట్ల చెల్లింపుపై బదిలీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాంతం గండికోట వద్ద ఓబెరాయ్ (విల్లాస్) రిసార్ట్ అభివృద్ధి కోసం 50 ఎకరాలను ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి అంగీకరించింది. కుప్పం నియోజకవర్గంలో 51 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులకు రూ.1422.15 లక్షలకు పరిపాలనా ఆమోదమిస్తూ మంత్రిమండలి ఆమోదించింది. దీనివల్ల ఆయా ప్రాంత రైతులకు లబ్ధి చేకూర్చేలా 1,6544.76 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుంది. శ్రీశైలం డ్యామ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ సేఫ్టీ పనుల నిమిత్తం రూ.350 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదించింది.
రెవెన్యూ సమస్యలను ఏడాదిలోపు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు మంత్రి కొలుసు వెల్లడిరచారు. ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయన్న అంశంపై చర్చ జరిగిందని, అన్నక్యాంటీన్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించినట్టు చెప్పారు. అన్న క్యాంటీన్లను మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవడానికి ఒక కమిటీని వేయాలని చంద్రబాబు సూచించారన్నారు. అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్కు సెప్టెంబర్లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్లోనే కొంటున్నామని స్పష్టం చేశారు. పొగాకుకు మార్కెట్లో ధర తక్కువగా ఉండటంతో రూ.250 కోట్లు కేటాయించామన్నారు. పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నట్టు మంత్రి పార్థసారథి వివరించారు.
సాహసోపేత పర్యాటక కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, ఆపరేషనల్ మార్గదర్శకాలు`2025 ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్లోని వైవిధ్యమైన సహజ ప్రకృతి దృశ్యాలు, పొడవైన తీరప్రాంతం, నదులు, బ్యాక్ వాటర్స్, వైవిధ్యమైన భూభాగాలతో సహా జల క్రీడలు, ట్రెక్కింగ్, పారాగ్లైడిరగ్, రివర్ రాఫ్టింగ్వంటి సాహస పర్యాటక కార్యకలాపాలకు అపారమైన అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను నిర్మాణాత్మక పద్ధతిలో ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాలను రూపొందించింది. సాహస పర్యాటక రంగంద్వారా గ్రామీణ సమాజాలు, మహిళలు, యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించే అవకాశముంది. అదే సమయంలో చిన్న, మధ్యతరహా సంస్థలకు మద్దతివ్వడం ద్వారా వ్యవస్థాపకతనూ ప్రోత్సహిస్తుంది. ఈ మార్గదర్శకాలు సాహస పర్యాటక కార్యకలాపాలను సురక్షితంగా, పర్యావరణ అనుకూలంగా, సామాజిక-ఆర్థిక లాభాలను గరిష్టంగా అందించేలా నిర్వహించడానికి నియంత్రణ ఫ్రేమ్వర్క్ను అందిస్తాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలో సాహస పర్యాటకం ప్రోత్సాహం, ఏపీని అడ్వెంచర్ టూరిజం గమ్యస్థానంగా నిలుపుతాయని మంత్రిమండలి నిర్థారించింది.
అలాగే, అమరావతిలో ఫోర్ స్టార్ లగ్జరీ హోటల్ అభివృద్ధికి, గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్కు ప్రోత్సాహకాలు అందించడానికి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మండలి ఆమోదించింది. దీని ద్వారా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అలాగే, పోలవరంలో ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్ అభివృద్ధికి భూమి కేటాయింపు, మెగ్లాన్ లెజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్కు ప్రోత్సాహకాలు అందించేందుకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చేసిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సాధ్యమవుతుంధని మండలి చర్చించింది. అలాగే, తిరుపతిలో ఫైవ్స్టార్ హోటల్ అభివృద్ధి కోసం పావని హోటల్స్కు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాభివృద్ధికై నిర్దేశించిన టూరిజం పాలసీ వేగవంతంగా అమలు జరపడంతోపాటు.. ఈ ప్రాంతంలో టూరిజం శాఖ ద్వారా 300 కొత్త ఉద్యోగావకాశాలు కలగనున్నాయి.
ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చేపట్టాలని, విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎపీ కల్చరల్ విభాగానికి బదిలీ చేయాలన్న ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది. పెండిరగ్ పనులను ఏపీ కల్చరల్ విభాగం ద్వారా నిధులిచ్చి పూర్తి చేయాలని, రాజధానిలో అమరావతిలో అన్ని హంగులతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. విశాఖ మధురవాడలో 22.19 ఎకరాల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేస్తూ రూ.1582 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో ఈ 3 రోడ్డును ఎన్హెచ్ 16కు అనుసంధానించేందుకు రూ.682 కోట్ల టెండర్లు ఆమోదానికి పరిపాలన అనుమతినిచ్చింది. ఎపీ మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు కోసం రూ.273.17 కోట్లు మంజూరుకు పరిపాలనపరమైన అనుమతులకు మంత్రిమండలి ఓకే చేసింది. రాష్ట్రంలో 20 మిలియన్ టన్నుల పొగాకును రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలని నిర్ణయిస్తూ.. వచ్చే ఏడాది పొగాకు సాగుకు క్రాప్ హాలిడే ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది.