- వెన్నుపోటు..పన్నుపోటుకు మారుపేరు వైసీపీ
- గొడ్డలిపోటు దినం కూడా జరుపుకోండి
- ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ
అమరావతి(చైతన్యరథం): వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి పొందిన రోజు జూన్ 4..జగన్రెడ్డి విధ్వంసకర పాలనతో విసిగిన ప్రజలు నరకాసురుడి పాలన నుంచి విముక్తి కోసం ఓటు రూపంలో తీర్పు ఇచ్చిన రోజు అని ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి కావ లి గ్రీష్మ అన్నారు. నిజానికి ఈ రోజును ప్రజలు దీపావళిగా జరుపుకోవాలి. కానీ, వైసీపీ నాయకులకు ప్రజా తీర్పు వెన్నుపోటులా కనిపిస్తోందంటే ప్రజాస్వామ్యం పట్ల వైసీపీ పార్టీకి ఎంత గౌరవం ఉందో స్పష్టమవుతోందన్నారు. మద్యపాన నిషేధం అనే బూటకపు హామీతో అధికారంలోకి వచ్చి కల్తీ మద్యంతో 30,000 మంది అక్కచెల్లెమ్మలకు పసుపు-కుంకుమ దూరం చేసి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని ప్రశ్నించారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులను మోసం చేసి వెన్నుపోటు పొడిచింది ఎవరు? జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువతను మోసం చేసి వెన్ను పోటు పొడిచింది ఎవరు? అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని మహిళలను వెన్నుపోటు పొడిచింది ఎవరు? అని ప్రశ్నించారు. ల్యాండ్, ఇసుక, మైనింగ్, మద్యం స్కామ్ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించ డానికి, ప్రజాహితంగా సాగుతున్న కూటమి పాలనను చూసి ఓర్చుకోలేక నిత్యం ఏదో ఒక డ్రామాతో, డ్రామా ఆర్టిస్టులతో ప్రజాక్షేత్రంలో చచ్చిపోయిన పార్టీని బతికించు కోవ డానికి జగన్రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు ఛీకొట్టినా వైసీపీ అధినేతకు, నాయకులకు బుద్ధి రావడం లేదు. గొడ్డలి పోటు దినం, సొంత చెల్లి-తల్లిని గెంటేసిన దినం, అమ్మ మీద కేసు పెట్టిన దినం ఎప్పుడు జరుపుకుంటారో కూడా వైసీపీ నాయకులు ప్రజలకు చెప్పాలని హితవుపలికారు.