- యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ప్రతినిధులకు మంత్రి లోకేష్ వినతి
- స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకరించాలి
- రెన్యువబుల్ ఎనర్జీ పరిశోధనలపై ఏపీ వర్సిటీలతో కలసి పనిచేయండి
- యూనివర్శిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- అధునాతన బోధనా పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, పరిశోధకులతో భేటీ
సిడ్నీ/ఆస్ట్రేలియా (చైతన్యరథం): ఏపీ యూనివర్శిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్లు ప్రారంభించాలని ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత యూని వర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) ప్రతినిధులను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఆ దేశంలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ సోమవారం సిడ్నీ రాండ్విక్లోని UNSWను సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి లోకేష్కు ఘనస్వాగతం పలికారు. అధునాతన బోధనా పద్ధతులు, టీచర్ ట్రైనింగ్, రెన్యూవబుల్ ఎనర్జీపై సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, పరిశోధకులతో మంత్రి లోకేష్ చర్చించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల తో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్లు, స్టూడెంట్ ఎక్స్చేంజి పథకాలను ప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా STEM, కృత్రిమ మేధస్సు (ఏఐ), రెన్యూవబుల్ రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ యువతకు అధునాతన టెక్నాలజీలలో శిక్షణ ఇచ్చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించండి. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేం దుకు స్థిరమైన వ్యవసాయం, నీటి నిర్వహణ అంశాల్లో ఏపీ వర్సిటీలతో కలసి సంయుక్త పరిశోధనలు చేపట్టాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఆవిష్కరణ కేంద్రాలు ఏర్పాటు చేయండి
సోలార్, విండ్ పవర్ టెక్నాలజీలలో UNSW నైపుణ్యాన్ని వినియోగిస్తూ పునరుత్పాదక శక్తి పరిశోధనల్లో ఏపీ వర్సిటీలతో కలసి భాగస్వామ్యం వహించండి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక స్టార్టప్స్ను ప్రోత్సహించడానికి UNSW లోని మైఖేల్ క్రౌచ్ ఇన్నోవేషన్ సెంటర్ మద్దతుతో ఆవిష్కరణ కేంద్రాలను నెలకొల్పండి. ఆంధ్రప్రదేశ్లోని ఐటీ, తయారీ రంగాలతో భాగస్వామ్యం వహించి, సంయుక్త పరిశోధన, అభివృద్ధి (R&D), సాంకేతిక మార్పిడి కార్యక్రమాలను బలోపేతం చేయండి. గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు టెలీ మెడిసిన్ ప్రజారోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించండి. ఆంధ్రప్రదేశ్ వైద్య సంస్థలతో కలిసి అంటువ్యాధులు, ఆంధ్రప్రదేశ్ వైద్య సంస్థలతో కలిసి అంటువ్యాధులు, మెటర్నల్ హెల్పై సంయుక్త పరిశోధనలు చేపట్టండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, స్థిరమైన పట్టణ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్తో కలసి పనిచేయండి. సమర్థవంతమైన, డేటా ఆధారిత పరిపాలన, పబ్లిక్ పాలసీలపై యుఎన్ఎస్ఈబ్ల్యూ నైపుణ్యాన్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి పంచుకోవాలని యూనివర్సిటీ ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు.
ఆస్ట్రేలియాలో అతిపెద్ద యూనివర్శిటీ
ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ… 1949లో సిడ్నీలో న్యూ సౌత్ వేల్ యూనివర్సిటీ టెక్నాలజీ పేరుతోప్రారంభమైన యూని వర్సిటీ…1958 నాటికి లీడింగ్ రీసెర్చి యూనివర్సిటీ గా అవతరించి యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (UNSW)గా రూపాంతరం చెందిందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా టాప్-50 యూనివర్సిటీల్లో ఒకటి గా ఉంటూ వస్తున్న యూని వర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (UNSW) గత ఏడాది క్యూఎస్ 45 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం యూని వర్సిటీలో ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాల నుంచి 64వేల మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తుండగా, 7వేలమంది అధ్యాపకులు పనిచేస్తు న్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అతిపెద్ద యూనివర్సిటీ గా విద్య, పరిశోధన రంగాల్లో సేవలందిస్తోందని తెలిపారు.
తమ యూనివర్సిటీ పరిశోధకులు మొదటి సౌరశక్తితో నడిచే కారు (1987), అధునాతన క్వాంటం కంప్యూటింగ్, HIV/AIDS పరిశోధనలతోపాటు ప్రాణాలను రక్షించే పలు వైద్య చికిత్సలను అభివృద్ధి చేశారు. ఖచీనాఔ నుంచి ఇప్పటివరకు 300కి పైగా స్టార్టప్లు ప్రారంభం కాగా, ఇన్నోవేషన్ ప్రాజెక్టుల కోసం 1 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సేకరించాం. 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం, సామాజిక అసమానతల నిర్మూలనకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నామని వివరించారు.
ఏటా 3 వేల మంది భారతీయ విద్యార్థులు
భారత్లో జాయింట్ రీసెర్చ్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమాల కోసం ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాసు యూనివర్సిటీలకు సహకారం అందిస్తున్నాం. ఫ్యూచర్ ఆఫ్ చేంజ్ స్కాలర్ షిప్ కింద 75శాతం ట్యూషన్ ఫీజు స్కాలర్ షిప్ కోసం ఏటా 3 వేల మంది భారతీయ విద్యార్థులు మా వద్ద నమోదు చేసుకుంటున్నారు. UNSW ప్రపంచ-ప్రముఖ స్కూల్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ రెన్యువబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ను ఉపయోగించుకుని భారతీయ సంస్థలతో సౌరశక్తి ప్రాజెక్టులపై భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రజారోగ్యం, అంటువ్యాధులు, ప్రసూతి ఆరోగ్యంపై ఎయిమ్స్కు సహకారం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్ల వంటి భారత టెక్ హబ్లో ఏఐ అండ్ ఎంఎల్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం తమ యూనివర్సిటీ నిమగ్నమైనట్లు UNSW ప్రతినిధులు తెలిపారు.