- ఉన్న సీటు పోతుందని వచ్చి పోవడం సరికాదు
- సమస్యలపై పోరాడని మీకు ప్రతిపక్ష హోదానా
- అసెంబ్లీలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫైర్
అమరావతి(చైతన్యరథం): గవర్నర్ ప్రసంగంతో రైతులు, ఉద్యోగులకు ఒక నమ్మ కం ఏర్పడిరది..ఉద్యోగం, ఉపాధి, వ్యవసాయం, నీటి పారుదల శాఖలన్నీ ఒక ట్రాక్లో పడతాయన్న భరోసా కలిగిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగిం చారు. జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి..పులివెందులకు ఎక్కడ బై ఎలక్షన్ వస్తుం దోనని, వస్తే ఆ సీటు కూడా పోతుందని 60 రోజులకు ఒకసారి అసెంబ్లీకి వచ్చి కని పించడం సరికాదని హితవుపలికారు. జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా లేక పోయినా ప్రతిపక్ష హోదా నాయకుడికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ తాము చందాల రూపంలో ఇస్తాం..విమానం టికెట్లు, రైల్వే టికెట్లు, పీఏ జీతాలు, వాహనాల డీజిల్ అన్నీ తాము అందిస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గానికి ప్రతినిధులుగా ఉండి సమస్యలపై అసెంబ్లీలో పోరాడకుండా నిబంధ నలకు విరుద్ధంగా తమ నాయకుడికి ప్రతిపక్ష హోదా కావాలనడం విడ్డూరంగా ఉంద న్నారు. పదేపదే ప్రతిపక్ష హోదా కావాలంటున్న ఆయనకు నిబంధనలు తెలుసుకోవాల న్నారు. 2010లో తమిళనాడులో ఏడీఎంకే, డీఎండీకే కలిసి పోటీ చేస్తే ఏడీఎంకేకు 0, డీఎండీకేకు 29 సీట్లు వచ్చాయని వచ్చాయని గుర్తు చేశారు. విజయకాంత్కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, అయితే ఎనిమిది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఆయన ప్రతిప క్ష హోదా కోల్పోయారన్నారు. అలాగే 2014లో కాంగ్రెస్ 543 స్థానాల్లో 44 స్థానాలు సాధించినా ప్రతిపక్ష హోదా రాలేదని, ఆ తర్వాత 2019లో 52 స్థానాలు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. 2024లో 99 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా ఇచ్చారని తెలిపారు. 2024లో రాహుల్గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన సందర్భాలను గుర్తుచేశారు. ఇదే జగన్ 23 స్థానాలు సాధించిన చంద్రబాబును గతంలో ఆరు స్థానాలు లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని వ్యంగ్యంగా అసెంబ్లీలో హేళన చేసిన విషయాన్ని గుర్తు చేశా రు. బీజేపీ నాయకులు, సీపీఎం, ఎంఐఏం నాయకులు ఫ్లోర్ లీడర్లుగానే పనిచేస్తారని గుర్తు చేశారు.
జగన్కు ప్రతిపక్ష హోదాలో లభించే బెనిఫిట్స్ కావాలంటే విమానం టికె ట్లు, రైలు టికెట్లు, పీఏ జీతాలు, వాహనాల డీజిల్ అన్ని చందాలు వేసుకుని ఇస్తామన్నా రు. అసెంబ్లీకి రాకుంటే పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయని, 60 రోజులకు ఒకసా రి జగన్ అసెంబ్లీలో కనిపించి వెళుతున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే అందరినీ బొక్కలో వేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే జగన్ శాసనసభకు రావా లని సూచించారు. నీటిపారుదల, వ్యవసాయం, జలజీవన్ మిషన్ను జగన్ ప్రభుత్వం మూసేసిందని, రోడ్లను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు, రైతాంగానికి ఉపయో గపడే ప్రాజెక్టుల వ్యయాలను 50 శాతం కంటే తగ్గించి నిధులు లేవని చూపారు..మైక్రో ఇరిగేషన్, బిందు తుంపర్ల సేద్యం, యాంత్రీకరణను మూసేశారు.. నాబార్డ్ నిధులు కూ డా లేవన్నారని మండిపడ్డారు. డ్రిప్ ఇరిగేషన్, అమరావతి రాజధాని, రోడ్ల మరమ్మతు లు, పోలవరం, కొత్త ప్రాజెక్టులు మొత్తం కూటమి ప్రభుత్వంలో ప్రారంభమవుతున్నాయ న్నారు. వేల కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడం శుభసూచిక మన్నారు. ఒక్క మంత్రి కూడా జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గడప తొక్కలేకపోయార న్నారు. అలాగే గత ప్రభుత్వంలో భూ కుంభకోణాలు భారీగా జరిగాయి..భూములను ఫ్రీ హోల్డ్ చేసి అమాయకుల పొట్ట కొట్టి ఆ భూముల పట్టాలు సాధించి వైసీపీ నాయకులం తా యజమానులు అయ్యారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయడం గొప్ప వరమని, కూటమి ప్రభుత్వములో పీఎం మోదీ అండ, పవన్కళ్యాణ్ ఫోర్స్, చంద్రబాబు దార్శినికతతో రాష్ట్రం ముందుకెళుతుందని స్పష్టం చేశారు.