- తలలు తీసే ఆయనకు తాటికాయలంటే భయమా?
- సుపరిపాలనను అడ్డుకోవడమే ఆయన లక్ష్యం
- ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో దుష్ట పరిపాలన తో అరాచక శక్తులను పోషించిన జగన్రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో సుపరిపాలనను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నాడని ఎమ్మె ల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండిరచారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో జగన్రెడ్డి తీరును దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపిస్తూ ప్రజల మన్ననలు పొందు తోంది.. ఓడిన జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా విధ్వంసమే.. పొదిలిలో అరాచక శక్తులతో విధ్వంసం అందరూ చూశారు.. బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహాన్ని పెట్ట డం చరిత్రలో ఎక్కడా లేదు.. ఈ నెపంతో జగన్ ముగ్గురి ప్రాణా లు తీశాడని ఆరోపించారు. జగన్ వాహనం కింద వైసీపీ కార్య కర్త పడి మరణించినా కారు ఆపకుండా నిర్దాక్షిణ్యంగా వెళ్లిపో యాడు. అంబులెన్స్కు దారివ్వకపోవడం వల్ల మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. కారు కింద పడిన విషయం తెలియ దని, డబ్బులు పంపానని జగన్ చెప్పడం హాస్యాస్పదం. డబ్బుల తో తప్పును కప్పిపుచ్చలేడని హితవుపలికారు. జగన్ లక్ష్యం అరాచక శక్తులతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి సుపరి పాలనను అడ్డుకోవడమేనని ఆరోపించారు. చంద్రబాబు సమర్థ వంతమైన పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని, జగన్ ఎన్ని కుట్రలు పన్నినా అధికారంలోకి రాలేడని హితవు పలికారు. కూటమి కార్యకర్తలు జగన్ బెదిరింపులకు భయపడ రని, ప్రజలు అతని కుట్రలను గమనిస్తున్నారని అన్నారు. జగన్ లా నియంతృత్వ విధానాలు అవలంబించడం లేదు. అయిన ప్పటికీ తనను నియంత్రిస్తున్నారని ఆయన చెప్పడం హాస్యాస్ప దంగా ఉందన్నారు.