- దావోస్ పర్యటనలో చంద్రబాబు సంకల్పం
- రాష్ట్రంలో పెట్టుబడులు బాబు విజన్కు నిదర్శనం
- నాడు జగన్ చేసిన పర్యటన విహార యాత్ర
- ఏపీ బ్రాండ్ని కుప్పకూల్చి డార్క్ ఏపీగా మార్చారు
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి పరిశ్రమలు తీసుకు రావాలి, వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలన్నదే చంద్రబాబు దావోస్ పర్యటన లక్ష్యమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ విజన్ 2047 అమలు చేయాలని, రాబో యే రోజుల్లో ఆంధ్రపదేశ్ను అగ్రస్థానంలో నిలపాలన్నదే చంద్రబాబు తపన అని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ దావోస్కు పెట్టుబడులకు వెళ్లి చలిగా ఉందని రూం లో ‘‘పాస్తా’’ తినుకుంటూ కూర్చోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చలిగా ఉందని పాస్తా తింటూ కూర్చోక అంత చలిలో కూడా ప్రతి టెంటుకు వెళ్లి పెట్టుబడిదారులతో పెట్టుబడులను ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు 2014-19 మధ్య లో సన్ రైజ్ ఏపీగా రాష్ట్రాన్ని ప్రకటించి దేశానికి పరిచయం చేస్తే.. జగన్ ఏపీ బ్రాండ్ని కుప్పకూల్చి డార్క్ ఏపీగా మార్చారు. జగన్ది ఆనాటి దావోస్ యాత్ర విహార యాత్ర అయితే.. చంద్రబాబుది నేటి దావోస్ యాత్ర ప్రజా జైత్రయాత్ర. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు లోకేష్ను వెతుక్కుంటూ రావడం, చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం తిరగడం పారిశ్రామికవేత్తలకు వీరిద్దరిపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోం ది.
జగన్ పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లినప్పుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రి అని ఎవరి నోటా రాలేదు. చంద్రబాబు దావోస్ వెళితే వేనోళ్ల పొగడుతున్నారు. జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదలిపారిపోవడం జగన్పై ఉన్న అపనమ్మకాన్ని తెలియజే స్తోంది. బిల్గేట్స్ లాంటి దిగ్గజం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించడం, ఆత్మీయం గా కౌగిలించుకోవడం, ఎంతైనా పెట్టుబడి పెడతానని హామీ ఇవ్వడం చంద్రబాబు విజన్ 2047 విజయాన్ని సూచిస్తోంది. దీంతో చంద్రబాబు ఖ్యాతిని ఇనుమడిరపజేస్తోంది. చంద్రబాబు, లోకేష్ తండ్రి, కొడుకులు అనవసరంగా దావోస్ వెళ్లారని జగన్ మాట్లాడ టం తప్పు.. చంద్రబాబు, లోకేష్లు రాష్ట్ర సంక్షేమం కోసమే దావోస్ వెళ్లారు, జగన్లా విహార యాత్రకు, లండన్ పర్యటనకు కాదు. జగన్ పరిపాలన అవినీతిమయం, అస్త వ్యస్తం.. వైసీపీ నాయకులు ఇక రాష్ట్రంపై ఆశలు వదలుకోవాల్సిందేనని హితవుపలి కారు. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అన్న చందంగా జగన్ రాష్ట్రానికి మేలు చేయక పోగా.. చంద్రబాబు పర్యటనను ప్రశ్నించడం తప్పు, జగన్ కేబినెట్ లోని కోడిగడ్ల మంత్రి అమర్నాథ్ జగన్ దావోస్లో చలిగా ఉందని బయటకు రాలేదని చెబితే.. చంద్రబ ాబు దావోస్లో 6 డిగ్రీల చలిలో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం తపించి ప్రతి పెట్టుబడిదారుడిని కలిశారన్నారు. చంద్రబాబును జగన్ విమర్శించడం సూర్యునిపై ఉమ్మేయటమే అవుతుందని హితవుపలికారు. రాబోవు రెండురోజుల్లో మొత్తం సినిమా ఇవ్వబోతున్నాం… వేలాదిమంది బిడ్డలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. జగన్ పెట్టుబడు లకు దావోస్ వెళ్లి ‘‘పాస్తా’’ తింటూ కూర్చోవడంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ఎంతవరకు ఆసక్తి ఉందో తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులను రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడనివ్వరని గ్రహించాలి. అంత చలిలో కూడా తండ్రి, కొడుకులు రాష్ట్రం కోసం తపిస్తుంటే..ఇబ్బందులు పడుతుంటే జగన్కు మాట్లాడే నైతిక హక్కు లేదని హితవుపలికారు.