- అక్కడ ఓట్ల శాతం పరిగణలోకి తీసుకుంటారు
- ఇక్కడ సీట్ల ప్రాతిపదికనే..నిబంధనల ప్రకారమే
- వైసీపీ కావాలనే సభా సమయం, ప్రజాధనం వృథా
- ఆ పార్టీ నేత సభకు వస్తే సమయం ఎంతిస్తారో తెలుస్తుంది
- గవర్నర్ ప్రసంగ సమయంలో వారి తీరు విచారకరం
- మీడియా పాయింట్లో ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్
అమరావతి(చైతన్యరథం): వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ ఐదేళ్లలో రాదు. ఫిక్స్ అయిపోండి. అది ముఖ్యమంత్రి చంద్రబాబో, నేనో కావాలని చేసింది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం..మన రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు. దీన్ని ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి మీడియాతో మాట్లాడారు. భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావల్సిన సీట్లను వైసీపీ గెలవలేకపోయింది. ఆ విషయం తెలిసినా కావాలనే వైసీపీ నాయకులు విలువైన శాస నసభా సమయం వృథా చేస్తున్నారు. సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలు ఉంటాయి.. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని సూచించారు. ఇటీవలే జర్మనీలో ఎన్నికలు నిర్వహించా రు..అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు..ఇక్కడ సీట్లు ప్రాతిపదికగా ఉం టుందని వైసీపీ వాళ్లు గ్రహించాలని సూచించారు.
తమ కన్నా ఓ సీటు ఎక్కువొచ్చినా..
రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేన కంటే ఒక సీటు అధికంగా తెచ్చుకుని ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేది. కానీ వారికి ప్రజలు కేవలం 11 సీట్ల ను మాత్రమే ఇచ్చారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. దీన్ని వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. అంతేకాని రాని ప్రతిపక్ష హోదా కోసం విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేయడం తగదు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హో దా డిమాండ్ పేరుతో వైసీపీ నేలబారు వ్యూహాలు అమలు చేస్తోంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేకపోయినా బడ్జెట్ సమావేశాల మొదటిరోజు ఆయన ప్రసంగించేందుకు వచ్చారు. ప్రసంగాన్ని పూర్తిస్థాయిలో వినకుండా వైసీపీ నానా యాగీ చేసింది. ప్రసంగ ప్రతులు చింపేయడం, ప్రసంగం మధ్యలో వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదు. వారు అనుసరిస్తున్న వైఖరి నిజంగా బాధాకరం. గవర్నర్ ప్రసంగంలో ఏముందో తెలుసుకోకుండానే వైసీపీ నాయకులు ఇష్టా నుసారం అరుపులు, కేకలు వేయడం వారి తీరును బయటపెడుతోందని తెలిపారు.
తక్కువ చేసి చూడలేదు..మర్యాద ఇస్తున్నాం
వైసీపీ నాయకుడు, వారి ప్రజాప్రతినిధులు మొదట అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. ప్రజల సమస్యలపై స్పందించాలి. హుందాగా చర్చల్లో పాల్గొనాలి. మొదట వైసీపీ నాయకుడు సభకు వస్తే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో తెలుస్తుంది. అసలు సభకే రాకుండా రాని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్లు చేయడం అనేది పూర్తిగా అనైతికం. మొదటి సమావేశాల్లోనే వైసీపీ నాయకులకు గవర్నర్, ముఖ్యమంత్రి, తాను తగిన గౌరవం ఇచ్చాం. 11 సీట్లే వచ్చాయని వారిని ఎవరూ తక్కు వ చేసి చూడలేదు. తగిన మర్యాద ఇస్తున్నాం. అయితే అసెంబ్లీకి రాకుండా మాకు సమ యం ఇవ్వరు.. మేం మాట్లాడలేం అని మాటలు చెప్పకుండా అసెంబ్లీకి వచ్చి చూస్తే సమయం ఎంత ఇచ్చారు..మీరు ఎం మాట్లాడారో కూడా ప్రజలకు తెలుస్తుందని సూచించారు.
ప్రోటోకాల్ను ఎవరైనా పాటించాల్సిందే
ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనలను ఎవరైనా పాటించాల్సిందే. ప్రోటోకాల్ మేరకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో మంత్రుల వరుసలోనే కూర్చున్నాను. అలాగే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో కూడా గవర్నర్ను ఆహ్వానించేం దుకు రావాలని తెలిపినా ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్, ముఖ్యమంత్రి, శాసనమండలి చైర్మన్ వెళతారని నేను వెళ్లలేదు. ఎవరైనా ఆ ప్రొటోకాల్ను పాటించాల్సిందే. దీన్ని వైస ీపీ నాయకులు గమనించాలి. మీకు ప్రజలు ఇచ్చిన సీట్ల సంఖ్య ప్రకారం మాత్రమే హోదా దక్కుతుంది. దాని ప్రకారం అసెంబ్లీలో మాట్లాడేందుకు, ప్రజా సమస్యలు చర్చించేందుకు తగిన సమయం ఇస్తారనేది గుర్తుంచుకోవాలని తెలిపారు. జాతీయ మీడియా ప్రతినిధులు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అంశంపై ప్రశ్నించగా మార్చి 14న ఆవిర్భావ సభ వేదికగా ఈ అంశంపై వివరంగా మాట్లాడుతాను. వక్ఫ్బోర్డు ఉంది.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు కావాలి అని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం తోనూ చర్చించి మిర్చి రైతులను ఆదుకునే ఏర్పాటు చేస్తామని తెలిపారు.