* నైపుణ్యం మెరుగుతోనే భవిష్యత్ అవకాశాలు
* 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నాం
* గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో యువత, మహిళలకు అవకాశాలు
* సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టలు ప్రారంభిస్తాం
* గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన
విజయవాడ (చైతన్య రథం) కాలానుగుణంగా యువత నైపుణ్యాలకు పదును పెట్టినపుడే అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుతాయని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ నోవాటెల్లో “సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హట్గా ఆంధ్రప్రదేశ్ అంశంపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనీషియేటివ్. సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్కు మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్ కేవలం దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ను శక్తివంతం చేయడం, సౌర, పవన శక్తికి నైపుణ్య హచ్గా ఏపీని తీర్చిదిద్దడమే కాదు.. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ను శక్తివంతంచేసే దిశగా నిర్వహించడం జరుగుతోందని, తద్వారా యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కష్టపడుతున్నాం
దేశంలో ఏ పార్టీ సాధించని విధంగా కూటమి
ప్రభుత్వం 94 శాతం స్ట్రైక్ రేట్తో 164 సీట్లను కైవసం చేసుకుంది. కూటమి ప్రభుత్వంలో ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇందుకోసం అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. క్లస్టర్ విధానంలో పెట్టుబడులను ఆకర్షిస్తాం. ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తాం. అనంతలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, కడప, చిత్తూరును ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హల్గా, నెల్లూరులో ఎయిర్ కండిషనర్స్ వంటి స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్, గుంటూరు, కృష్ణాను క్యాంటమ్ వ్యాలీ హబ్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను ఆక్వా హల్గా, ఉత్తరాంధ్రను ఫార్మా, డేటా సెంటర్, ఐటీ హబ్గా, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తాం. ప్రతి వంద కి.మీలకు ఓ క్లస్టర్ ఏర్పాటుచేసి ఆయా రంగాల్లో టాప్ 20 కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీంతోపాటు నైపుణ్యం పెంపు, నవీన ఆవిష్కరణలకు ప్రాధాన్యత. ఇస్తున్నట్టు మంత్రి లోకేష్ ప్రకటించారు.
సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ను ప్రారంభిస్తాం
“రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి అనేక
పరిశ్రమలు వస్తున్నాయి. ప్రైవేటు సెక్టార్ నైపుణ్యంగల యువతను అనుసంధానించాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ను ప్రారంభిస్తున్నాం. స్కిల్ కార్పొరేషన్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరముంది. పునరుత్పాదక ఇంధనరంగంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రం చొరవ తీసుకుని యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తాం. అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను సిద్ధం చేయాల్సిన అవసరముంది. నా ఛాలెంజ్్ను స్వీకరించి సుజ్ఞాన్ సంస్థ ఇప్పటికే 2 నైపుణ్య శిక్షణా కేంద్రాలను నిర్మించింది. అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి” అని మంత్రి లోకేష్
గ్రీన్ ఎనర్జీ సెక్టార్ ద్వారా యువతకు విస్తృత అవకాశాలు
డెవలప్మెంట్ “గ్రీన్ ఎనర్జీ సెక్టార్ ద్వారా మహిళలకు వారి గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువగళం పాదయాత్ర సమయంలో అనంత జిల్లాలోని కియా యాన్సిలరీ యూనిట్స్లో మహిళలు పనిచేయడం చూశాను. ఓ మహిళ నా వద్దకు వచ్చి నాతోపాటు నడిచారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించినపుడు.. కియా యాన్సిలరీ యూనిట్స్ లో పనిచేస్తున్నానని, గతంలో సాధారణ గృహిణిగా ఉన్న తాను ఇప్పుడు నెలకు రూ. 40వేలు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలిచానని గర్వంగా చెప్పారు. ఇప్పుడు కుటుంబంలో తనకు ఎంతో గౌరవం దక్కుతోందని చెప్పారు. ఒక్క కియా పరిశ్రమవల్ల అనంత పురం జిల్లాలో వచ్చిన మార్పు ఇది. గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయి. అందుకే విండ్, సోలార్, రెన్యువబుల్, పంప్డ్ స్టోరేజ్, పీబీజీ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిసారించాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై సీఎం చంద్రబాబు చాలా పట్టుదలతో ఉన్నారు. దీనిని చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నాం.
స్పష్టం చేశారు.
ఇందుకోసం ప్రైవేటు సెక్టార్తో కలిసి పనిచేస్తాం. ఓంక్యాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని” లోకేష్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీఎస్ఎస్ఎసి చైర్మెన్ బూరుగుపల్లి శేషారావు, నెర్జివ్ వైస్ చైర్మెన్ కమలాకర్ బాబు, స్వనీతి ఇనీషియేటివ్ సీఈఓ రీత్వికా భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.