- 65 ఏళ్లు పైబడి వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దనే..
- ఈ విధానంతో ప్రభుత్వానికి రూ.385 కోట్లు ఆదా
- గత ప్రభుత్వంలో రూ.1650 కోట్లు దుర్వినియోగం
- తూకాల్లో వ్యత్యాసమున్నా, సరుకులు లేవన్నా చర్యలు
- పారదర్శకత కోసం త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటు
- భవిష్యత్తులో షాపులను మినీ మాల్స్గా మారుస్తాం
- గత ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం
- స్వలాభం కోసం ఎండీయూ వ్యవస్థను సృష్టించింది
- మూలనపడ్డ వాటితో పంపిణీ చేసినట్లు దొంగ లెక్కలు
కాకినాడ(చైతన్యరథం): ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడు తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,761 రేషన్ షాపుల ద్వారా 1.46 కోట్ల కుటుంబాలకు సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామని వెల్లడిరచారు. మొదటి నాలుగు గంటల్లో 8.15 లక్ష ల కుటుంబాలకు రేషన్ సరుకులు అందించినట్లు వెల్లడిరచారు. రేషన్కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఇంటింటికీ రేషన్ పేరిట గత ప్రభుత్వం దాదాపు రూ.1700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తే… రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీతో దాదాపు రూ.385 కోట్ల ప్రజా ధనం ఆదా అవుతుందని తెలిపారు. ఆదివారం ఉదయం పిఠాపురం గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వీధిలో 18వ వార్డులో చౌకధరల దుకాణం, కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల, వాకలపూ డిలో రేషన్ పంపిణీని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,761 రేషన్ షాపులకు 24,795 షాపుల్లో ఉదయం నుంచి సరుకుల పంపిణీ ప్రారంభమైనట్లు చెప్పారు.
ఆదివారాల్లోనూ సరుకుల పంపిణీ
ప్రతి నెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. ఆదివా రాల్లోనూ సరుకులు పంపిణీ చేస్తాం. ఆ సమయంలో ఎప్పుడైనా లబ్ధిదారులు రేషన్ తీసు కునే వీలుంటుంది. దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకి ప్రతి నెలా 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందించేలా చర్యలు తీసుకున్నాం. అటువంటి వారు రాష్ట్రవ్యాప్తంగా 15.6 లక్షల మంది ఉన్నట్లు గుర్తించాం. వారికి రేషన్ అందించే బాధ్యత రేషన్ దుకా ణదారులదే. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. రేషన డెలివరీ అయిన వెంటనే అందులో ఫొటో అప్లోడ్ చేసేలా డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం.
భవిష్యత్తుల్లో మరిన్ని మార్పులు
తూకాల్లో వ్యత్యాసం ఉన్నా, సరుకులు లేవని తిప్పి పంపినా డీలర్లపై చర్యలు తీసుకుం టాం. డీలర్లు ఈ-పోస్, వేయింగ్ మెషీన్ల పనితీరును ముందుగానే పరిశీలించుకోవాలి. సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో సరుకుల పంపిణీ చేయాలి. సరుకుల పంపిణీ సమాచార కోసం కొత్తగా ఒక యాప్ను డిజైన్ చేశాం. ఏ రోజు ఎంత రేషన్ పంపిణీ చేశాం? ఎంత మందికి అందించాం? వంటి విషయాలు ఎప్పటికప్పుడు నమోదయ్యేలా చూస్తున్నాం. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేలా రేషన్షాపుల్లో భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. లబ్ధిదా రులకు ఏదైనా సమస్య తలెత్తితే సులువుగా ఫిర్యాదు చేసేలా షాపు వద్దే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
అన్ని పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేస్తాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ మాఫియాకు చెక్ పెట్టాం. ఎక్కడికక్కడ మాఫియా కోరలు పీకేశాం. కాకినాడ, విశాఖ పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి కాకుండా పటిష్టభద్రత ఏర్పాటు చేశాం. రైస్ స్మగ్లింగ్ చేసిన వారిపై పీడీ యాక్ట్ తీసుకొచ్చాం. కాకినాడ పోర్టు దగ్గర ఏర్పాటు చేసినట్లే… నెల్లూరు జిల్లా తడ, కృష్టపట్నం పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఎక్కడా పక్కదారిపట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
భవిష్యత్లో మినీమాల్స్గా దుకాణాలు
ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిష్యత్తులో రేషన్ దుకాణాలను మినీమాల్స్గా మారుస్తామని తెలిపారు. బియ్యం ఒక్కటే కాకుండా రాగు లు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరు ధాన్యాలు అందించే ఏర్పాటు చేస్తామని వివ రించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,761 రేషన్షాపుల ద్వారా ఉదయం నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేస్తు న్నామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేసిందన్నారు.
రూ.1650 కోట్లు దుర్వినియోగం
వైసీపీ పాలనలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఇంటింటికీ రేషన్ పేరిట ప్రజా ధనం దాదాపు రూ.1650 కోట్లు ఖర్చు చేసి 9260 ఎండీయూ వాహనాలు కొనుగోలు చేశారు. ఈ వాహనాల వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం కలుగకపోగా, బియ్యం అక్రమ రవాణాకు దారి తీసింది. మూలన పడ్డ వాహనాలతో రేషన్ డెలివరీ చేసినట్లు లెక్కలు చూపించినట్లు మండిపడ్డారు. రేషన్ దుకాణాల్లో ధరల బోర్డులు, స్టాక్ బోర్డులు, పోస్టర్ల ప్రదర్శన సరైన విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా డిపో వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1670 కోట్లు ధాన్యం బకాయిలుపెడితే వాటిని కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే చెల్లించింది. భారతదేశంలో ఏ రాష్ట్రమూ కొనుగోలు చేయని విధంగా రూ. 12,400 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దాదాపు 8 లక్షల మంది రైతులకు 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశాం. రైతులు మిల్లులకు వెళ్లి ధాన్యం ఇచ్చి వచ్చే లోపు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. అంతకుముందు పిఠాపురం పట్టణంలో సకిలేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఏపీ ఎస్ఐడీసీ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.