దావోస్ (చైతన్యరథం): ప్రపంచ ప్రసిద్ధ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నుండి ఏపీకి సంబంధించి త్వరలోనే శుభవార్త వస్తుందని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడిరచారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈఓ ఎస్ రవికుమార్ తో దావోస్ బెల్వడేర్ లో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రవికుమార్తో భేటీ అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే గుడ్న్యూస్ రాబోతోందని చెప్పారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ను ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీలో డీప్టెక్ హబ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ -2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరామన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో హైస్కిల్డ్ వర్క్ ఫోర్స్ను తయారుచేయడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ మాట్లాడుతూ… కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో పనిచేస్తున్న 80వేలమంది ఉద్యోగులను టైర్ -1 నుంచి టైర్ -2 నగరాలకు మార్చేందుకు ప్రణాళికలను ప్రకటించామని తెలిపారు. గ్లోబల్ స్కిల్ ఇనియేటివ్లో భాగంగా జెనరేటివ్ ఏఐ అధునాతన సాంకేతిక నైపుణ్యాల్లో 10లక్షల మందికి సాధికారిత కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని రవికుమార్ తెలిపారు.