- గ్లోబల్ బ్రాండ్ను సంతరించుకోనున్న అన్నపూర్ణ ఆంధ్ర
- ఏపీలో ఆవిష్కరించనున్న ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’
- సీఎం చంద్రబాబు దార్శనికతకు ఇది నిలువుటద్దం
- రేపటి తరానికి పుట్టుకురానున్న సేద్యపు ఇంజనీర్లు!
అమరావతి (చైతన్య రథం సేద్యానికి సాంకేతికతను అనుసంధానించి –అగ్రి టెక్ లో విప్లవాత్మక ఫలితాలు రాబట్టేందుకు ఆంధ్రలో క్రమంగా అడుగులు పడుతున్నాయి. ప్రాకృతిక ఆధునిక విధానాలను మేళవించి.. సరికొత్త సేద్యం విధానాన్ని ఆవిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం అడగులేస్తోంది. ఇందులో భాగంగా ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటు చేద్దామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా ప్రతిపాదన -సామాన్య మెదళ్లకు అంతుచిక్కని గొప్ప శుభారంభమే.. రెండురోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశిస్తూనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అకస్మాత్తు ప్రతిపాదన ఇది. –ఐఎస్బీ తరహాలో ఐఎస్ఏ (ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రిలక్చర్) డీమ్డ్ వర్శిటీ ఏర్పాటు చేద్దామన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అద్దంపట్టేదే. భవిష్యత్ సేద్యాన్ని.. ప్రజల ఆహార అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఆధునిక సాగు విధానానికి అంకురార్పణ జరగాలంటే ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ వ్యవస్థ ఆవశ్యకతను చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని సాంకేతికతతో అనుసంధానించి, రైతు ఆదాయాన్ని మరింత పెచాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. ఏఐ ఆధారిత అగ్రిటెక్ సేవలు, కొత్తతరం రైతులకు శిక్షణ, వ్యవసాయంలో ఆవిష్కరణలు ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యాలు కానున్నాయి. ముఖ్యంగా (ఏఐ అగ్రిటెక్) వ్యవసాయ సమస్యల పరిష్కారానికి కృత్రిమ మేధస్సు ద్వారా రైతులకు సేవలను అందించడం. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని (కొత్తతరం రైతులు) ఆధునిక సాంకేతికతతో కూడిన, లాభసాటి వ్యవసా యాన్ని ప్రోత్సహించే యువతను తయారు చేయడం. సేద్యాన్ని సుస్థిరం చేయడానికి (పరిశోధన మరియు శిక్షణ) వ్యవసాయ అనుబంధ రంగాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పరిశోధనలు. సాగించడం.. ఇదీ క్లుప్తంగా ప్రణాళిక స్వరూపం, రైతు సంక్షేమానికి ఆధునిక సాంకేతికతను జోడించి వ్యవసా యాన్ని మరింత లాభసాటిగా మార్చడమే నా లక్ష్యమంటూ చంద్రబాబు చాలాకాలంగా వ్యక్తం చేస్తోన్న ఆలోచనల్లో ఇదే కీలక సారాంశం.
నిజానికి -పాతికేళ్ల కిందట హైదరాబాద్లో ఏర్పాటైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటి, సేద్యానికీ అదే తరహా అత్యున్నత వ్యవస్థ (ఐఎస్ఏ) ఏర్పాటు దిశగా చంద్రబాబు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టింది. అప్పుడు ఐఎస్బీ ఏర్పాటుకు చొరవ చూపిందీ, ఇప్పుడు ఐఎస్ఏ ఏర్పాటు దిశగా అడుగులేస్తోందీ -సీఎం చంద్రబాబే. ఏ ప్రాజెక్టునైనా -చివరి ఘట్టం తరువాతను సైతం ఆలోచించాకే.. మనసులో మాట బయట పెట్టే చంద్రబాబు -‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ ప్రతిపాదనను అలాగే ప్రకటించారు. ప్రకటించిందే తడవు..ప్రపంచంలోనే వ్యవసాయ విద్య, పరిశోధనలో అగ్రగామిగా ఉన్న నెదర్లాండ్స్క చెందిన వాగెనింగెన్ విశ్వవిద్యాలయ (డబ్ల్యూయూఆర్) ప్రతినిధుల బృందంతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్పై తన ఆలోచనల్ని వర్శిటీ ప్రతినిధుల ముందుపెట్టారు.
జూన్ నాటికి నివేదిక
వ్యవసాయ, అనుబంధ రంగాల విద్యకు ఏపీ కేంద్రంగా తయారయ్యేలా ఐఎస్ఏ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వాగెనింగెన్ వర్శిటీ ప్రతినిధుల బృందానికి చంద్రబాబు వివరించారు. ఇందులో భాగస్వాములు కమ్మంటూ ఆహ్వానించారు. వివిధ రంగాల నిపుణులు, సంస్థలతో చర్చించి.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలనీ కోరారు. సీఎం చంద్రబాబు అడిగిందే తడవుగా -వాగెనింగెన్ వర్సిటీ ప్రతినిధుల బృందం ‘యాక్షన్ ప్లాన్’పై కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని అన్నిరకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు ఏపీలో పండుతున్నాయని.. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ రంగాల్లో రైతులకు చేయూత అందించేలా సూచనలు చేయాలన్నది వర్శిటీ ప్రతినిధులకు చంద్రబాబు చేసిన సూచన. ఐఎస్ఏ ఏర్పాటుకు సంబంధించి జూన్నాటికి డీపీఆర్ సిద్ధం చేసేందుకు ప్రతినిధి బృందం ఉద్యుక్తులైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా -ఏపీలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల్ని పరిశీలించేందుకు వాగెనింగెన్ వర్సిటీ బృందం నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది.
‘సాప్ట్వేర్ కోడింగ్’ కాదు.. ఇక ‘సాయిల్ కోడింగ్’
ఈ నినాదాన్నిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబే. ప్రస్తుతం ఐటీలో వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయన్నది వాస్తవం. ఒకప్పుడు వేల డాలర్లు పలికిన సాఫ్ట్వేర్ సర్వీసులు.. నేడు ‘విద్యుత్ ఛార్జీల’ స్థాయికి పడిపోయాయి. ఈ తరుణంలో కేవలం డేటాను ప్రాసెస్ చేసే కోడింగ్ కే పరిమితమైతే ఏదోక సమయంలో వెనుకబడే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఇప్పుడు మనకు కావాల్సింది ‘సాయిల్ కోడింగ్, ఐటీ కేవలం సమాచారాన్ని విశ్లేషిస్తే, అగ్రి-టెక్ మనిషి జీవన ప్రమాణాలను, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మారుతున్న కాలం విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్లు, డేటా సెంటర్లను వ్యవసాయంతో అనుసంధానించడమే సరికొత్త వ్యూహం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సృష్టించిన ఏఐ, నేడు అదే ఉద్యోగాల ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తోంది. అందుకే క్వాంటం, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, డ్రోన్లవంటి సరికొత్త విభాగాలవైపు రాష్ట్రాన్ని మళ్లించడం అనివార్యం, సీఎం చంద్రబాబు వేస్తోన్న అడుగులు అటువేస్తే.
నెదర్లాండ్స్ స్ఫూర్తి..?
వైశాల్యంపరంగా అమెరికాకంటే 270 రెట్లు చిన్నదైన నెదర్లాండ్స్, నేడు ప్రపంచంలోనే వ్యవసాయ ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉందంటే అద్భుతమే. ఆ అద్భుతానికి కారణం అక్కడి వాగెనింగెన్ యూనివర్సిటీ అందించిన సాంకేతిక విజ్ఞానం. వైశాల్యం ముఖ్యం కాదు, వాడే టెక్నాలజీ ముఖ్యమని నెదర్లాండ్స్ నిరూపించింది. అదే మోడల్ను ఏపీలో అమలు చేస్తే, ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రం ఆహార భాండాగారంగా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
‘మేడ్ ఇన్ ఏపీ’.. కొత్త గ్లోబల్ ట్రెండ్?
దేశానికే అన్నపూర్ణ అని పేరు తెచ్చుకున్న ఆంధ్ర రాష్ట్ర రక్తంలోనే ప్రకృతి సేద్యం ఉంది. దీనికి ‘గ్లోబల్ సర్టిఫికేషన్’ జోడిస్తే ‘మేడ్ ఇన్ ‘ఏపీ’ బ్రాండ్ ప్రపంచ మార్కెట్లను శాశించగలుగుతుంది. ధాన్యాన్ని పండించే ‘అన్నపూర్ణ’ను.. ప్రపంచానికి నాణ్యమైన ఆహారం, ఆరోగ్యాన్నిచ్చే ‘హెల్త్ అండ్ నాలెడ్జ్ హబ్’ ్కు చేర్చబోతున్నాం. అందుకు పడిన మొట్టమొదటి అడుగీ -ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రిలక్చర్ డీమ్డ్ వర్శిటీ ఏర్పాటు ప్రతిపాదన..
రాయలసీమ హార్టికల్చర్ హబ్
గతంలో డ్రిప్ ఇరిగేషన్.. తరువాత శ్రీశైలం నీటితో రాయలసీమను హార్టికల్చర్ హట్గా మార్చిన విజన్ ఇప్పటికే కంటిముందున్న దృశ్యం. ఇప్పుడు అది రెండో దశకు (ఫేజ్-2) చేరుతోంది. కేవలం వంట పండించడమే కాదు, ఐఎస్ఏ ద్వారా వ్యాపార విలువను (వాల్యూ అడిషన్) జోడించి, ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా సీమ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా అడుగులు పడతాయనడంలో సందేహం లేదు. మారుతున్న ప్రపంచ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మనల్ని మనం రీ-బ్రాండింగ్ చేసుకునే ప్రక్రియగా చూడాలి!
అన్నపూర్ణ పునర్వైభవం దిశగా..
మార్పును ముందుగా పసిగట్టే నాయకత్వం ఉన్నప్పుడే -ఏ జాతికైనా ఉజ్వల భవిష్యత్, ఐటీ ఉద్యోగాల అనిశ్చితి.. మన యువతను మళ్లీ మట్టివైపు, మాతృభూమివైపు చూసేలా చేస్తోంది. ఇది కేవలం సాగు కాదు, వందల కోట్ల టర్నోవర్ కలిగిన గ్లోబల్ బిజినెస్, నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ప్రపంచాన్ని ఏలిన తెలుగువారు, భవిష్యత్లో అగ్రి-టెక్ ఎక్స్పర్ట్స్ గా గ్లోబల్ మార్కెట్న శాసించడానికి సమయాత్తమవుతున్నట్టే!















