అమరావతి (చైతన్య రథం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్లో పోస్టు పెడుతూ.. “ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడంనుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం.. నేడు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేవరకూ కొనసాగుతోంది. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీశక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లువంటి పథకాలను అమలు చేస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా 7955మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంగన్వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. ఐదు లక్షలమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని… ఇప్పటికి లక్షమంది మహిళలను మైక్రో, ఎంఎసఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశాం. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ…. కేంద్రంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాం. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు మీ అందరి సహకారం, భాగస్వామ్యం కోరుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగుదేశం -కూటమి ప్రభుత్వాల హయాంలో
మహిళా సంక్షేమ ఘట్టాలు (2014నుంచి ఇప్పటివరకు)
- మహిళల ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా వ్యవస్థను బలోపేతం చేసి లక్షలాది మహిళలకు బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు అందించే విధానం అమలు చేసింది.
- డ్వాక్రా మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పసుపు కుంకుమ పథకం ద్వారా సుమారు 93 లక్షల మహిళలకు రూ.10 వేల చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం అందించింది.
- డ్వాక్రా మహిళలపై ఉన్న రుణభారం తగ్గించేందుకు రుణమాఫీ కార్యక్రమాన్ని అమలుచేసి వారికి కొత్తగా రుణాలు పొందే అవకాశం కల్పించింది.
- మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీపం పథకం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించింది.
- బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తల్లికి వందనం పథకం అమలు చేసి లక్షలాది తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేసింది.
- మహిళలు, యువతులు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి ప్రతిరోజూ లక్షలాది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తోంది.
- గ్రామీణ మహిళల జీవనోపాధి మెరుగుదలకు సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది.
లి ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.50 వేలనుంచి రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలిచ్చే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. - బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పెట్టుబడి రాయితీని 35శాతం నుంచి 45శాతానికి పెంచింది.
- మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించేందుకు ఎంఎసఎంఈ పార్కులు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చింది.
- గ్రామీణ మహిళలకు శిక్షణ, మార్కెటింగ్, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తూ “వన్ ఫ్యామిలీ -వన్ ఎంటర్ప్రెన్యూర” లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టింది.
- గ్రామీణ మహిళలకు ఆదాయం వచ్చేలా డీజీ లక్ష్మీ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ట్యాబ్లు పంపిణీ చేసి కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించింది.
- మహిళలు కుటీర, చిన్నతరహా పరిశ్రమలు ప్రారంభించేందుకు బ్యాంకుల ద్వారా రూ.3 లక్షలనుంచి రూ.20 లక్షల వరకు రుణాల లింకేజీ కల్పించింది.
- ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ఉన్నతి పథకం ద్వారా రుణ పరిమితిని రూ.2 లక్షలనుంచి రూ.5 లక్షలకు పెంచి మహిళా సంఘాలకు రూ.25 లక్షల వరకూ రుణాలు అందించింది.
- అంగన్వాడీ, ఆశా వర్కర్ల సంక్షేమం కోసం జీతాలను గణనీయంగా పెంచి వారి సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించేలా నిర్ణయాలు తీసుకుంది.
- గ్రామీణ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, తల్లి-శిశు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది.
- గర్భిణీలు మరియు ప్రసవానంతర తల్లులకు ఉచిత రవాణా అందించేందుకు తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభించింది.
- గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు పోషకాహారం అందించేందుకు అన్న అమృత హస్తం పథకం అమలు చేసింది.
- గర్భిణీల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సీమంతాలు కార్యక్రమం నిర్వహించింది.
- పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు సహాయం చేయడానికి చంద్రన్న పెళ్లి కానుక పథకం అమలు చేసి లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది.
- ముస్లిం మైనారిటీ బాలికల వివాహానికి దుల్హన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించింది.
- మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రోషిణి కార్యక్రమం ద్వారా శిక్షణ మరియు ఆర్థిక సహాయం అందించింది.
- వితంతు మహిళల సంక్షేమం కోసం వితంతు పెన్షన్లను పెంచి వారికి ఆర్థిక భద్రత కల్పించింది.
- మహిళల పేరుమీద ఇళ్ల పట్టాలు ఇచ్చి వారికి ఆస్తి హక్కు మరియు ఆర్థిక భద్రత కల్పించే విధానం అమలు చేసింది.
- మహిళలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ అమలు చేసి గ్రామీణ రాజకీయాల్లో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసింది.
- మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ అమలు చేసి ఉపాధి అవకాశాలను పెంచింది.
- మహిళా భద్రత కోసం మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసింది.
- ఆర్టీసీలో మహిళా కండక్టర్ల నియామకంతో మహిళలకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
- బాలికల విద్యను ప్రోత్సహించేందుకు పాఠశాలకు వెళ్లే విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసింది.
- అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ చెల్లింపులు ప్రారంభించి వారి సేవలకు గౌరవం కల్పించింది.
- మహిళలు, యువత, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రతిరోజూ సగటున 15 నుంచి 25 లక్షల మంది ప్రయాణించేలా చేసింది.
- మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ కొనుగోళ్లలో 45% రిజర్వేషన్ కల్పించే విధానాన్ని అమలు చేస్తోంది.
- రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2.5 లక్షల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో శిక్షణ, రుణాలు, మార్కెటింగ్ సహాయం అందిస్తోంది.
- మహిళల ఆర్థిక స్వావలంబన పెంచేందుకు స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.
- మహిళా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి 2026–27 బడ్జెట్లో మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమానికి రూ.4,582 కోట్లు కేటాయించింది.
- ప్రతి తల్లికి ఆర్థిక భరోసా కల్పించేందుకు “తల్లికి వందనం” పథకానికి రూ.9,668 కోట్లు కేటాయించింది.
- గ్రామీణ మహిళా, శిశు సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 9,958 అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
- 4,687 మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చి సేవలను విస్తరించనుంది.
- అదనంగా 192 కొత్త అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో సేవలను పెంచనుంది.
- గర్భిణీలు, చిన్నారుల పోషణ మరియు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే చర్యలు చేపడుతోంది.
- మహిళలను ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా శిక్షణ, రుణాలు, మార్కెట్ అవకాశాలను కల్పిస్తోంది.
- జగన్ హయాంలో మహిళలపై కక్షసాధింపు ఘట్టాలు:
- చేయూత పథకంకింద 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయలేదు.
- ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.1.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.75 వేలే ఇచ్చి భారీ ఆర్థిక నష్టం కలిగించారు.
- డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి సుమారు రూ.27,451 కోట్ల రుణమాఫీ అమలు చేయలేదు.
- సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించారు.
- వడ్డీ రాయితీగా ఇవ్వాల్సిన రూ.6 వేల కోట్లలో కేవలం రూ.1,260 కోట్లు మాత్రమే ఇచ్చారు.
- మహిళల పొదుపు నిధులైన సుమారు రూ.10 వేల కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారు.
- పేద కుటుంబాల ఆడపిల్లలకు అండగా ఉన్న పెళ్లి కానుక పథకాన్ని రద్దు చేశారు.
- బాలికల చదువును ప్రోత్సహించే సైకిల్ పథకాన్ని నిలిపివేశారు.
- గర్భిణీల కోసం ఉన్న తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను నిలిపివేశారు.
- గిరిజన ప్రాంతాల్లో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఫీడర్ అంబులెన్సులను కూడా నిలిపివేశారు.
- పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేశారు.
- ఉచిత ఇళ్ల పేరుతో మహిళల నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు బలవంతంగా వసూలు చేశారు.
- సెంటు పట్టా పేరుతో మహిళలను అప్పులపాలు చేశారు.
- గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచి పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెంచారు.
- రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగి 2022లో 25,503 కేసులు నమోదయ్యాయి.
- అత్యాచారాలు, అత్యాచార యత్నాలు కూడా గణనీయంగా పెరిగాయి.
- వైసీపీ పాలనలో 30,196 మంది మహిళలు మరియు చిన్నారులు అదృశ్యమయ్యారు.
- మహిళల భద్రత కోసం ప్రకటించిన పథకాలు కేవలం ప్రచార స్థాయిలోనే ఉండి ప్రాయోగికంగా ఫలితాలు ఇవ్వలేదు.
- నాశిరకం మద్యం, గంజాయి, డ్రగ్స్ విస్తరణవల్ల మహిళల భద్రతపై ప్రతికూల ప్రభావం పడింది.















