అమరావతి (చైతన్యరథం): పోలవరం`బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ‘‘జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్’’ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది. బనకచర్లతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయం కేంద్రంగా ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. ఈ సంస్థను 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి వరద నీటిని ఒడిసిపట్టుకుని రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడమే బనకచర్ల ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.