- 2.62 కోట్ల మందికి కూటమి ప్రభుత్వం కానుక
- రోజుకు 25 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణం
- భద్రత దృష్ట్యా కొండ ప్రాంతాల్లో అనుమతించలేదు
- వైసీపీ చేస్తున్న విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదు
- స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
అమరావతి(చైతన్యరథం): ఉచిత బస్సు ప్రయాణం పథకం ‘స్త్రీ శక్తి’తో మహిళల్లో నూతనోత్సాహం తీసుకువచ్చిందని స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రంలోని 2.62 కోట్ల మహిళల గౌరవార్థం స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇచ్చిన కానుకగా తెలి పారు. ఈ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలు అవుతుం దని, రోజుకు దాదాపు 25 లక్షల మంది మహిళలు ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. సోమవా రం సచివాలయం ప్రచార విభాగంలో మీడియాతో ఆమె మాట్లాడా రు. రాష్ట్ర జనాభాలో దాదాపు 50 శాతం మంది మహిళలే ఉన్నా రని, వారి అభ్యున్నతిని కాంక్షిస్తూ అన్ని రంగాల్లో సమాన అవకా శాలు కల్పించాలనే లక్ష్యంతో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అమలు చేయ డం జరుగుతుందన్నారు. ఆర్టీసీకి ఉన్న మొత్తం బస్సుల్లో దాదాపు 74 శాతం అంటే 8,458 బస్సుల్లో రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్జెండర్లు, బాలికలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని చంద్రన్న ప్రభుత్వం కల్పిం చిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు మహిళలకు కలుగుతుందని, రోజు వారీగా పనిచేసుకునే మహిళలు, మహిళా ఉద్యోగస్థులు, విద్యార్థినులు చిరువ్యాపారులకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గి పోయిందన్నారు. ఈ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రయాణ ఛార్జీల రూపంలో నెలకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఆదా అవుతుందన్నారు. ఈ పథకం పేద కుటుంబాల్లో ఆర్థిక పొదుపును తీసుకురావడమే కాకుండా శుభకార్యాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే, తీర్థయాత్రలు చేసే మహిళలు, వృద్ధులకు ఎంతోగానో ప్రయోజనకరంగా మారిందని వివరించారు.
వైసీపీ విమర్శల్లో నిజం లేదు
స్త్రీశక్తి పథకాన్ని అన్ని పార్టీలు సమర్థిస్తుంటే వైసీపీ లేనిపో ని విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొండ ప్రాంతాల్లోని ఘాట్ రోడ్లలో మహిళ ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించలేదన్నారు. వైసీపీ అక్కసుతో చేస్తున్న విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్గాల కారణంగా నేడు అంగన్ వాడీలు అన్నింటికీ శెలవును ప్రకటించడం జరిగిందన్నారు. భారీ వర్షాల పరిస్థితుల ను బట్టి మంగళవారం అంగన్ వాడీలకు శెలవు ఇచ్చేది, లేనిది కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. రానున్న మూడేళ్లలో డోలీ రహిత గ్రామాలుగా గిరిజన గ్రామాలను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. తొలి ఏడాదిలో రూ.7,500 కోట్ల బడ్జెట్ను గిరిజన సంక్షేమానికి కేటాయించడం జరిగిందని, అందులో ఇప్పటికే రూ.1,300 కోట్లను వెచ్చించి దాదాపు 60-70 శాతం గ్రామాలకు రోడ్ల సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని, రానున్న ముడేళ్లలో గిరిజన గ్రామాలు అన్నింటికీ రోడ్ల కనెక్టివిటీని కల్పించేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.