- ఏర్పాటు చేయాలని ఓమియం సంస్థకు మంత్రి లోకేష్ వినతి
- సంస్థ సీఎస్టీఓ చొక్కలింగంతో భేటీ
శాన్ఫ్రాన్సిస్కో/యూఎస్ఏ (చైతన్యరథం): ఎలక్ట్రోలైజర్, ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కాంట్రాక్ట్ సేవలు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారుచేసే అంతర్జాతీయ సంస్థ ఓమియం (ూష్ట్రఎఱబఎ) చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీఎస్టీఓ) చొక్కలింగం కరుప్పయ్యతో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లోని ఇండస్ట్రియల్ జోన్ల్లో (కృష్ణపట్నం లాంటి) ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో సౌర/పవన సామర్థ్యంతో నడిచే పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను సహ-అభివృద్ధి చేయడంతోపాటు సరఫరా పరిశ్రమలు, రవాణా, అమ్మోనియా ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దీనిపై ఓమియం సీఎస్టీఓ చొక్కలింగం మాట్లాడుతూ… తమ సంస్థ బెంగళూరులో ప్రపంచంలోనే అతిపెద్ద గిగావాట్ ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోందని చెప్పారు. నార్త్ అమెరికా, యూరోప్, ఇండియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇండస్ట్రియల్, ఎనర్జీ, యుటిలిటీ సెక్టార్లలో సేవలందిస్తున్నామని చెప్పారు. భారత్, యుఎస్ కేంద్రాల నుండి ప్రోటాన్-ఎక్స్ఛేంజ్ మెమ్బ్రేన్ (ూజువీ) సాంకేతికత, ఎఫిషియన్సీ ఆప్టిమైజేషన్, ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ సొల్యూషన్స్లో ఆవిష్కరణలపై తాము దృష్టిసారించినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చొక్కలింగం చెప్పారు.












