- షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం
విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖలో సోమవారం జరిగిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొని పది, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకే కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. విద్యార్థులు కష్టపడి చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలి. వారం రోజుల్లో తల్లికి వందనం కార్యక్రమం అమలు చేస్తాం. గురుకులాల్లో నీట్ కోచింగ్ సెంటర్లు 3 నుంచి 10 కి పెంచాం. లోకేష్ మంత్రి అయ్యాక విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి డోలా చెప్పారు.