- వర్గీకరణపై త్వరలోనే వన్మ్యాన్ కమిషన్ నివేదిక
- వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదు
- టీడీపీ పాలనలోనే 70 శాతం ఉపాధ్యాయ నియామకాలు
- మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం
అమరావతి(చైతన్యరథం): ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానమి చ్చారు. నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. వారందరికీ సమాధా నం చెప్పాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు. ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలి. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 నుంచి చూస్తే 2,60,194 పోస్టులు భర్తీ చేశారు. అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేశాం. ఒక్క టీడీపీ హయాంలోనే 70 శాతం టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డీఎస్పీ ఫైల్పైనే తొలి సంతకం చేయడం జరిగింది.
అందులో భాగంగానే గత సంవత్సరం జూలై 2న టెట్ నిర్వహించాం. 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరుకాగా 1.87 లక్షల మంది అర్హత సాధించారు. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 21 వరకు టెట్ పరీక్ష ను పూర్తిచేయడం జరిగింది. వర్గీకరణపై వన్మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబో తుందని భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతకు ఈ సభ సాక్షిగా హామీ ఇస్తు న్నా. ప్రతిపక్ష పార్టీ నేతలు తన శాఖకు సంబంధించి ప్రశ్నలు వేసి చర్చించేందుకు సిద్ధం గా లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడా లని సూచించారు.