- పెట్టుబడులతో రావాలంటూ సిఫీకి లోకేష్ ఆహ్వానం
- లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన సిఫీ పండీ
- ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సముఖత
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సిఫీ టెక్నాలజీస్ ఛైర్మెన్ అండ్ మ్యానేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్నను విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ను సిఫీ టెక్నాలజీస్ ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న బుధవారం కలిసారు. ఈ సందర్భంగా రాజు వేగేశ్న మాట్లాడుతూ సిఫీ టెక్నాలజీస్ సంస్థ దేశంలో ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒక్కటిగా ఉందని, దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న అనేక కంపెనీలు, బ్యాంకులు సహా నార్త్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు సింగపూర్లోని వివిధ కంపెనీలకు సిఫీ డేటా సర్వీసెస్ అందిస్తుందని మంత్రి లోకేష్కు వివరించారు. కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి ఆయన లోకేష్తో చర్చించారు. విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్ మరియు కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్ ఏర్పాటుపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతమున్న అవకాశాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సేవలు, కొత్తగా తీసుకొచ్చిన ఐటీ పాలసీల గురించి నారా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిఫీ ఛైర్మెన్ రాజు వేగేశ్న సుముఖత వ్యక్తం చేశారు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో చర్చించి తదుపరి ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని సిఫీ ప్రతినిధులను లోకేష్ కోరారు.