- ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలకు మార్గదర్శనం
- పరిశ్రమల స్థానకు చేయూత
- ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ విజ్ఞప్తి
- ప్రధానితో మర్యాద పూర్వక భేటీ
- ప్రస్తుతం అందిస్తున్న సహాయ,సహకారాలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్
న్యూఢల్లీి (చైతన్యరథం): ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం, ఉన్నతవిద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మీ సహకారం, మార్గదర్శనం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15నెలలుగా మీ సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం, మీ నేతృత్వంలో వికసిత్ భారత్ – 2047లో భాగస్వాములం అవుతామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మంత్రి లోకేష్ వివరించారు. ప్రధాని మోదీ స్పందిస్తూ… రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేష్ బహుకరించారు.










