- విభజన హామీల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు నిధులివ్వండి
- జల జీవన్ మిషన్లో కేంద్ర వాటా విడుదల చేయండి
- పీఎంకెఎస్వై `ఆర్ఆర్ఆర్కూ కేంద్ర వాటా ఇవ్వాలి
- ఏపీకి నీటి భద్రత అత్యంత కీలకాంశం
- సాగు, తాగునీటి అవసరాలపై సానుకూలంగా స్పందించండి
- కేంద్ర జలవనరుల మంత్రితో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఢిల్లీ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్కు నీటి భద్రత అత్యంత కీలకాంశమని.. పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఒకరోజు ఢల్లీి పర్యటనలో భాగంగా శుక్రవారం సీఎం చంద్రబాబు.. కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై పాటిల్తో చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండిరగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత కీలక అంశమని పేర్కొంటూ.. రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర-రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలుకు రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేశామని.. దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
పీఎంకెఎస్వై `ఆర్ఆర్ఆర్ పథకం
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే, పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండిరగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. రెండోదశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. ఇక, వంశధార నదీ వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని వివరించారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా, ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై తక్షణమే కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపెంపు అంశం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని భావిస్తోందని, దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని సీఎం వివరించారు. అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్నాటక ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లకుండా కేంద్రం నిలువరించాలని పాటిల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.













