- దేశంలో వివిధ ప్రాంతాలతో పాటు
- పోర్టులను వాటితో అనుసంధానించాలి
- ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కనెక్టివిటీ
- ఈ ఏడాది చివరికల్లా ప్రాజెక్టులు పూర్తి కావాలి
- పుష్కరాల్లోపే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి
- ఈవీ బస్సులు పెంచి రవాణా వ్యయం తగ్గించాలి
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం
- రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్ష
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మా ణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు భవనా లు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదా రులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధా నించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. “రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండా లి. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉంది. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశిం చారు. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలి.. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే.. వాటినే వెంటనే సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
రోడ్ల నిర్వహణపై అధ్యయం చేయాలి
రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పద్దతులను అవలంబిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలి. ఆర్ అండ్ బీ రహదారుల మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాలి. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల ను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాల ని సూచించారు. రహదారి నిర్వహణకు ప్రామాణికతను నిర్దేశిం చాలి. స్థానికంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణం అంశాలను పరిగణనలోకి తీసుకుని రోడ్ల నిర్వహణలో చర్యలు చేపట్టాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్న చోట హైబ్రీడ్ మోడల్లో బీటీ లేదా వైట్ ట్యాప్ రోడ్ల నిర్మాణం చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాలువలు ఉన్న 570 కిలోమీటర్ల మేర రహదారులు పదే పదే ధ్వంసం అవుతున్నాయి.
ఇలాంటి ప్రాంతాల్లో ఏ మెటీరియల్తో రోడ్ల నిర్మాణం జరిగితే బాగుంటుందనేది ఆలోచన చేయాలి. దీనిపై యూనివర్శిటీల్లో అధ్యయనం చేయిస్తే కొత్త ఆవిష్కరణలు వస్తా యి. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టండి. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తంగా 471 గ్రామాల్లో రోడ్లను మరమ్మతులు చేపట్టాలి. గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధి లో చేపట్టే రోడ్ల అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు రోల్ మోడల్ గా నిలిచేలా పనులు చేపట్టాలి. పుష్కరాలకు ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ.400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయాలి. దీని కోసం సాస్కీ నిధులను వినియోగించుకోవాలి. కుంభమేళా తరహాలో పుష్కరాల కు నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని’ అని సీఎం సూచించారు.
పోర్టుల అనుసంధానానికి ప్రాధాన్యం
“రాష్ట్రంలోని పోర్టులను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. ఆర్థిక లావాదేవీలకు కేంద్రంగా పోర్టులు ఉన్నాయి. పోర్టులను కనెక్ట్ చేసేలా పశ్చిమ భారతంలో గుజరాత్ మోడల్ అలానే ఉంది. తూర్పు భారతంలో తీర ప్రాంతం, పోర్టుల విషయంలో ఏపీ కీలకంగా ఉంది. ఈస్ట్-వెస్ట్ కారిడార్గా జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ఈ రకమైన కనెక్టివిటీని పెంచడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గించటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలి. లాజిస్టిక్స్ రంగాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసేలా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలి. దీని నిమిత్తం ఏపీ లింక్ ద్వారా ఆర్థిక వనరులు సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. మౌలిక సదుపాయాల ద్వారా సామాన్యుడికి సౌకర్యాలు పెరగాలి. ఇదే సమయంలో ఆర్థిక లావాదేవీలు జరగాలి. ప్రభు త్వం ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. ప్రతి పైసా సద్వినియోగం కావాలి..అత్యుత్తమ ఫలితాలు రావాలని సూచించారు.
రహదారుల కార్గో వ్యయం తగ్గాలి
ప్రస్తుతం 73 శాతం కార్గో రోడ్ రవాణా ద్వారానే వెళుతోంది. రైల్వే ద్వారా వెళ్లే కార్గో వ్యయం తక్కువగా ఉన్నట్టే రహదారుల కార్గో వ్యయం కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. మూలపేట, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టుల మధ్యనున్న ప్రాంతాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ఆయా పోర్టులను అను సంధానం చేసే సమయంలో ఆయా పోర్టులకు సమీపంలోని పొరు గు రాష్ట్రాల సరిహద్దులను కలుపుకుని వెళ్లేలా ప్రధాన రహదారు లు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. రహదారుల నిర్మా ణం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి. జాతీయ రహదారులకు సమీపంలో ఉండే ప్రాంతాల అభివృద్ధి జరగాలి. జాతీయ రహదా రులతో పాటు దేశ నిర్మాణం జరగాలి. ఏపీ పారిశ్రామిక, ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా మారుతోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు కనెక్టు చేసేలా రహదారులు రావాలని సూచించారు.
రూ.24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలి
వివిధ నగరాలకు రింగ్ రోడ్లు వస్తే ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తృ తం అవుతాయి. పొరుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలను ఏపీని కనెక్టు చేసేలా రహదారుల నిర్మాణం జరగాలి. ఖరగ్ పూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబా ద్-శ్రీశైలం డోర్నాల హైవే, కల్వకుర్తి-నంద్యాల హైవే వంటి జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. వివిధ కారిడా ర్ల ద్వారా 1335 కిలోమీటర్ల జాతీయ రహదారులు రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాదిలో రూ.24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో అవుటర్ కారిడార్ మోడల్స్ను అధ్యయనం చేయాల ని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
ఈవీలతో తక్కువ రవాణా వ్యయం
అతి తక్కువ వ్యయంతో ప్రజా రవాణా అందుబాటులోకి రావాలి. దీనికి ఈవీ బస్సుల వినియోగం సరైన మార్గం. క్లీన్ ఫ్యూయెల్ వినియోగం ఎక్కువ జరిగితే ఖర్చు తగ్గుతుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. సోలార్ పవర్ను సమర్థంగా నిర్వహించడం ద్వారా విద్యుత్ కొనుగోలు ధరను సుమారు రూ.1 మేర తగ్గించ గలిగాం. కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ విధానంపై దృష్టి సారిస్తే తక్కువ ఖర్చు.. ఎక్కువ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈవీ బస్సులకు కిలోమీటరుకు రూ.72 వ్యయం అవుతోంది. వివిధ మోడళ్లను అధ్యయనం చేసి అతి తక్కువ వ్యయంతో ఈవీలను ఆపరేట్ చేయాలి. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్టాండర్డైజేషన్ లాంటి అంశాలను పరిశీలించా లి. అన్నీ కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్సులే ఉండాలి. ఈ సైకిళ్ల వినియోగం మరింతగా పెంచేలా ప్రమోట్ చేయాలి. ఈ-సైకిళ్లు మాస్ ట్రాన్ పోర్టుగా మారేంతగా ప్రజలకు అవగాహన కల్పిం చాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మ ణ్యం, జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు హాజరయ్యారు.













