- రోజా అండతో బెదిరింపులు
- భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు
- ప్రజావినతుల్లో బాధితుడి ఫిర్యాదు
మంగళగిరి(చైతన్యరథం): మాజీ వైసీపీ ఎమ్మెల్యే రోజా అండ తో వైసీపీకి అనుకూలంగా ఉన్న మునికుమార్ అనే కానిస్టేబుల్ తమ పొలాన్ని వారికి నచ్చిన రేటుకు అమ్మలేదని దొంగ అగ్రిమెం ట్లతో తమను ఇబ్బంది పెడుతున్నాడని తిరుపతి జిల్లా వడమా లపేట మండలం సీతారామపురం గ్రామానికి చెందిన డి.గుణశే ఖర్నాయుడు ఫిర్యాదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఏపీ మహిళా సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పీతల సుజాత అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా గుణశేఖర్నాయుడు సమస్యను వివరించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. ` నందివెలుగు పైపుల రోడ్డులో గతంలో తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని వైసీపీ కబ్జాదారులు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నా రని గుంటూరు జిల్లా గుంటూరు క్రిస్టియన్పేటకు చెందిన కను మూరి మరియమ్మ ఫిర్యాదు చేసింది.
తాము రూ.7 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోగా అమ్మిన వారు అదేరోజు మరొకరికి ఇంటిని మళ్లీ అమ్మి తమను మోసం చేశారని బాపట్ల జిల్లా బాపట్లకు చెందిన మాచర్ల సాంబదుర్గ ఫిర్యాదు చేశా రు. తాము ఇచ్చిన డబ్బు అడిగితే తాము ఎవరో తెలియదని దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన లక్ష్మి, ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ` గత ప్రభుత్వంలో తమ భూమికి పట్టా మంజూరు చేస్తామని చెప్పి వీఆర్వో, వీఆర్ఏలు రూ.45 వేలు తీసుకుని మోసం చేశారని చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండల కేంద్రానికి చెందిన షేక్ మస్తాన్ సాహెబ్ ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.
` 2017-2018లో నీరు చెట్టులో భాగంగా తాము చేసిన అభివృద్ధి పనులకు రావాల్సిన బిల్లులు ఇప్పించాలని అనంతపు రం జిల్లా యల్లనూరు మండలం పి.ఎం.కొండాపురం గ్రామానికి చెందిన చల్లా చంద్రశేఖరనాయుడు అభ్యర్థించారు.
` తమ గ్రామంలో శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మించాలని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడుకు చెందిన షేక్ మీరావలి విజ్ఞప్తి చేశారు.
` షేక్ హుస్సేన్ అనే వ్యక్తి తమ వద్ద రూ.3 లక్షలు డబ్బులు తీసుకుని మరొకరి స్థలాన్ని తమకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశా డని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన గుమ్మల చెన్నలక్ష్మి ఫిర్యాదు చేసింది. దొంగ రిజిస్ట్రేషన్పై ప్రశ్నించగా డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.
` గత ప్రభుత్వంలో జరిగిన రీ సర్వేలో తమకు తొమ్మిది సెంట్లు తగ్గించి మరొకరికి ఎక్కించారని ఏలూరు జిల్లా నూజివీడు కు చెందిన చలసాని శ్రీనివాసరావు తెలిపారు. దీన్ని సరిచేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` తమ భూమికి సర్వే చేయకుండా గత ప్రభుత్వంలో వైసీపీకి చెందిన వ్యక్తులు అడ్డుపడ్డారని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన షేక్ ఖాశీం సాహెబ్ వివరించారు. దయచేసి సర్వే చేసి తమ భూమి కి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు.