- అంతర్వేది వద్ద సముద్రంలో ఇద్దరు మత్స్యకారుల మృతి
- అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం
అమరావతి (చైతన్యరథం): జీవనభృతి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మృతి చెందిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బోటు నుంచి జారిపడి మృతిచెందిన కృష్టాజిల్లా నాగాయలంక మండలం గుల్లదామోదర గ్రామానికి చెందిన నాగిడి రాము, సంగమేశ్వర గ్రామానికి చెందిన తమ్ము పోతురాజుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు, మత్స్యశాఖ నుంచి మరో రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున అందించనున్నారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మృతుల కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులకు ఎప్పటికి కప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రమాదాలు జరగకుండా తీసుకువాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని మత్స్యశాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.