అమరావతి (చైతన్య రథం): వాజపేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశం దశ-దిశ మార్చిందని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. వాజపేయి స్ఫూర్తిని యువతలో నింపేలా ‘అటల్ సందేశ్… మోదీ సుపరిపాలన’ యాత్ర తలపెట్టిన భాజపా కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మంత్రులు, కూటమి పంపీలు, పమ్మెలేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11నుంచి 25 వరకు చేపట్టే అటల్ సందేశ్ -మోదీ సుపరిపాలన’ యాత్రలో మూడు పార్టీల నేతలూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలో సుపరిపాలనకు వాజపేయి నాంది పలికారని, ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాది వేశాయని గుర్తుచేశారు. అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని కొనియాడారు. ఒక సాధారణ కుటుంబలో జన్మించిన ఆయన స్వశక్తతో పదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. 9సార్లు లోక్సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందన్నారు. పద్దెనిమిదేళ్ల వయసలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని, 1998లో పోఖ్రాన్`2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తి చాటారన్నారు. కార్గిల్ యుద్ధంలో శత్రువులకు తిరుగులేని సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. వాజపేయితో వ్యక్తిగతంలో తనకు మంచి అనుబంధం ఉందని, రాష్ట్రాభివృద్ధికి ఆనాడు ఎంతో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేసుకున్నారు. నాడు అణు పరీక్షలైనా, నేడు సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా నేడు సాగరమాల అయినా.. అవి పన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047నాటిక నంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారన్నారు. యువతరానికి మోదీ స్ఫూర్తినిస్తున్నారన్నారు. వాజపేయి శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.













