- అర్హులైన అందరి ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున జమ
- ఆర్థికంగా ఇబ్బందులున్నా అండగా నిలుస్తున్నాం
- కూటమి పాలనలో ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నాం
- గత ప్రభుత్వం గ్రీన్ టాక్స్ నడ్డివిరిస్తే.. కూటమి ప్రభుత్వం ఆదుకుంది
- ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
విజయవాడ (చైతన్యరథం): సమర్థమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. అందుకు కూటమి ప్రభుత్వ పాలనే నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గా స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, హామీలకు కార్యరూపం ఇస్తూ ప్రజలందరికీ అండగా నిలుస్తోందన్నారు. స్త్రీ శక్తి పథకంతో ఇబ్బందిపడుతున్న ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో భరోసా నింపేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలసి ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.
ఉండవల్లి లోటస్ పాయింట్ నుంచి విజయవాడ సింగ్ నగర్ వరకు జి. రాజేష్ అనే డ్రైవర్కి చెందిన ఆటోలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ప్రయాణించారు. అనంతరం సింగ్ నగర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్
మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి వర్గానికి అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ సందర్భాల్లో
ఆటో డ్రైవర్లను కలిసినప్పుడు గ్రీన్ టాక్స్ పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి తీసుకువచ్చారు. రహదారుల నిర్వహణ చేయకపోవడం వల్ల ఏ విధంగా నష్టపోతున్నది చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర లోపే ఆ సమస్యలకు పరిష్కారం చూపాం. గత ప్రభుత్వం వాహన మిత్ర పేరిట రూ. 10 వేలు ఇచ్చింది. ఇచ్చిన రూ. 10 వేలు రోడ్ల మీద గుంతలు పూడ్చకపోవడం వల్ల ఆటోలకు మరమ్మత్తులు చేయించుకోవడానికి కూడా చాలేవి కాదు. ఆ సమస్యను
పరిష్కరించేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన రోడ్లకు మరమ్మత్తులు చేశాం. అవసరం ఉన్న
చోట కొత్త రోడ్లు నిర్మించామని పవన్ తెలిపారు.
మాట నిలబెట్టుకున్నాం
స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కేబినెట్లో చర్చకు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ల ఇబ్బందుల గురించీ ముందుగా ప్రస్తావించాం. స్త్రీ శక్తి పథకం వారి ఉపాధిని దెబ్బ తీసే అవకాశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్లను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోమని ముఖ్యమంత్రి మాటిచ్చారు. ఆ ప్రకారం
ఆటో డ్రైవర్ల అందరి ఖాతాల్లో రూ. 15 వేలు చొప్పున జమ చేస్తున్నాం. కష్టాల్లో మీకు వెన్నుదన్నుగా నిలవాలనేది కూటమి ప్రభుత్వ ఉద్దేశం. ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఈ పథకాన్ని ముందుకు సుకువెళ్తున్నందుకు
ఆటో డ్రైవర్లందరి తరఫున సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు పిఠాపురం పర్యటనలో
ఉండగా నేను ఆటోలో ప్రయాణించిన సందర్భంలో ఆ ఆటో డ్రైవర్ ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ సోదరులకు
ఎదురయ్యే ఇబ్బందులను, వారి సమస్యలను నాకు వివరించారు. ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకంతో మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అర్హులైన 2 లక్షల 90 వేల 234 మందికి ఆటో డ్రైవర్ సేవలో
పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. మీ అందరి కోసం కూటమి ప్రభుత్వం రూ. 436 కోట్ల భారాన్ని ఆనందంగా మోస్తుంది. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి, వారి జీవనోపాధి కాపాడటం బాధ్యతగా భావిస్తున్నాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో భవిష్యత్తులోనూ ఆటో డ్రైవర్ సోదరులకు అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బొండా
ఉమామహేశ్వరరావు, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.