అమరావతి (చైతన్య రథం): సాంకేతిక రంగంలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిభ, మౌలిక సదుపాయాలపై నాస్కాం బృందంతో చర్చించినట్టు సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ ‘ప్రపంచ టెక్ హబ్గా ఏపీని నిలబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాత్మక దృష్టిపై చర్చించేందుకు ఈఆర్ అండ్ డి అధ్యక్షుడు రాజేష్ నంబియార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీనివాసన్, ఈఆర్ అండ్ డి అధిపతి శివప్రసాద్ పొలిమెట్లతో కూడిన నాస్కామ్ ప్రతినిధి బృందం కలిశారు. భారతదేశ అభివృద్ధి చెందుతున్న టెక్ రంగానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించే స్థాయి, ప్రత్యేక ప్రయోజనాలపై చర్చించారు. ముఖ్యంగా కృత్రిమ మేథ, క్వాంటం, ప్రతిభ అంతరాలను తగ్గించడానికి 100కె టెక్ అప్రెంటిస్ ప్రోగ్రామ్, గ్రీన్ డేటా, మౌలిక సదుపాయాల కోసం కోస్టల్ క్లౌడ్, సైబర్ కారిడార్లాంటి అంశాలపై చర్చించాము’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.