- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
- సివిల్ శిక్షణ కేంద్రం ఆకస్మిక తనిఖీ
- పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశం
విజయవాడ(చైతన్యరథం): బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమని, కార్పొరేట్కు ధీటుగా సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రంలో బోధనా సదుపాయాలు కల్పిం చామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గొల్లపూడి బీసీ భవన్లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి శుక్రవా రం ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, అభ్యర్థుల విశ్రాంతి గదులు, బాత్ రూమ్లను పరిశీలించారు. అదే సమయంలో సీ సెట్ పరీక్ష జరుగుతున్న తరగతిని కూడా పరిశీలిం చారు. ఎంతమంది విద్యార్థుల పరీక్షకు హాజరయ్యారని కో ఆర్డినేటర్ సాగర్ను అడిగి తెలుసుకున్నారు. పక్క గదిలో ఉన్న డిజిటల్ లైబ్రరీని సందర్శించి అక్కడ పలువురు అభ్యర్థులతో మాట్లాడారు. స్టడీ మెటీరియల్ సరఫరా, అధ్యాపకుల బోధన, తరగతుల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయం, ఇతర మౌలిక సదుపా యాల కల్పనపైనా ఆరా తీశారు. బోధనతో పాటు కార్పొరేట్ శిక్షణ కేంద్రాలకు ధీటుగా డిజిటిల్ లైబ్రరీ, ఇతర సౌకర్యాలు కల్పించారని అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అపరిశుభ్రతపై ఆగ్రహం
వంటి గది, విశ్రాంతి గదులు అపరిశుభ్రంగా ఉండడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి భోజనం కోసం టామాటా, ఇతర కూరగాయలు ఉదయమే కోసి సిద్ధం చేయడమే కాకుండా వాటిపై ఈగలు వాలుతుండటం, ఆ పక్కనే వాడుక నీరు ఉండడంపైనా అసహనం వ్యక్తం చేశారు. పక్వానికి రాని అరటి పండ్లను చూసి అక్కడే ఉన్న బీసీ వెల్ఫేర్ అధికారులపై మండిపడ్డారు. అన్ని గదులనూ శుభ్రం చేయకపోవ డంపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు గదులు, బాత్రూమ్లు శుభ్రం చేయించాలని ఆదేశించారు. ప్రభుత్వం రూపొదించిన చార్ట్ ప్రకారం మెనూ అమ లు చేయాలని, ఎప్పటికప్పుడు తయారుచేసిన ఆహారం అందించాలని స్పష్టం చేశారు.
ఎంతో ఉన్నత ఆశయంతో సీఎం బీసీ అభ్యర్థులకు సివిల్స్ శిక్షణ ఇప్పిస్తున్నారని, ఇటు వంటి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. అనంతరం సివిల్ సర్వీసెస్ కోచింగ్ అభ్యర్థులతో కలిసి భోజనం చేశారు. అభ్యర్థులు తన దృష్టికి తీసుకొచ్చిన సమ స్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీసీ యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నది సీఎం చంద్రబాబు ఆశయమన్నారు. దీనిలో భాగంగా సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కార్పొరేట్కు ధీటుగా ఉచిత శిక్షణ అందజేస్తున్నా మన్నారు. సివిల్స్ పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.