అమరావతి (చైతన్యరథం): ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో ముగిసింది. జకాత్ పేరుతో సాటి వారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం. పేద కుటుంబాల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయవల్ల విజయవంతం కావాలని కోరుకుంటూ.. అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.