అమరావతి (చైతన్య రథం): తెలుగింటి ఆడపడుచులు, ప్రియమైన అక్కాచెల్లెళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం పక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా.. ‘నీ కోసం నేనున్నా’నని భరోసా కల్పించే శుభ సందర్భమే రాఖీ పర్వదినం. అందుకే రాఖీ పౌర్ణమి మనందరికి ప్రత్యేకం. మీ అందరికి ఒక అన్నగా మీకు రక్షణ కల్పిస్తూ.. మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాదని రాఖీ సందర్భంగా మరోసారి ప్రకటిస్తున్నా. ఆడబిడ్డల బాగుకోసం అహర్నిశలూ పని చేస్తానని హామీ ఇస్తూ అందరికి మరొక్కమారు రాఖీ శుభాకాంక్షలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.