ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టా పాదనలతో సూర్యలంక బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిది ద్దేందుకు స్వదేశీ దర్శన్ 20 కింద రూ.97 కోట్లను కేంద్రం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సీఎం, మంత్రి లోకేష్ పరిశీ లించారు.














