- సైకోలకు బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదు
- వైసీసీ క్రిమినల్ ఐడియాలజీ దౌర్భాగ్యం
- రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్కు పరామర్శా?
- ఆరు సూత్రాలపై నీలిమీడియాలో వక్రభాష్యాలా?
- మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజం
నెల్లూరు(చైతన్యరథం): కడప వేదికగా జరిగిన మహానాడు సూపర్ సక్సెస్ను వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. లోకేష్ ఆరు సూత్రాలకు వక్రభాష్యాలు చెబుతూ నీలి పత్రికలో వైసీసీ క్రిమినల్ ఐడియాలజీ ప్రదర్శిస్తోందన్నారు. విద్యా శాఖ మంత్రిగా లోకేష్ చేపట్టిన సం స్కరణలను ఓర్వలేకే జగన్రెడ్డి కరపత్రికలో అబద్ధాలతో విషం చిమ్ముతున్నారని ధ్వజమె త్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మా యువ నాయకుడు లోకేష్ పడుతున్న తపన చూసి జగన్రెడ్డి, ఆయన మాజీ మంత్రులు కడుపు మంటతో రగలిపోతున్నారు. మహానాడులో రాష్ట్ర భవిష్యత్ కోసం లోకేష్ బాబు ఆరు సూత్రాలను ప్రతిపాదిస్తే వైసీపీ మాత్రం తమ డీఎన్ఏలోని క్రిమినల్ ఐడీయాలజీని ఆవిష్కరించింది. వైసీపీ ఆవిష్కరించిన ఆ నాలుగు అంశాలను ఈ రోజు మీ ముందుకు తెస్తున్నా. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేదిక వద్ద వైసీపీ శ్రేణుల ఆగడాలు మరీ శ్రుతి మించాయి. ఓ చిన్నారి సైకిల్ను లాక్కుని గాల్లోకి ఎగరేస్తారు. ఆ చిన్నారి తన సైకిల్ ఇచ్చేయని ఏడుస్తూ వేడుకుంటున్నా కాళ్లతో తొక్కి పైశాచిక ఆనందం పొందారు.. తెనాలిలో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ సభ్యులైన ముగ్గురికి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్లను జగన్రెడ్డి పరామర్శిస్తాడంట. ఆ ముగ్గురి నేరచరిత్ర చూస్తే ఒక్కొక్కరిపై తొమ్మిది కేసులు ఉన్నాయి. తిరుమల క్యూలైన్లో కాకినాడకు చెందిన వైసీపీ నేత అచ్చారావు టీటీ డీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తాడు. ఆ నినాదాలను వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. పదో తరగతి పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ అంశాన్ని కూడా వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. 2022లో రీవాల్యుయేషన్ కోసం 41,694 దరఖా స్తులు వస్తే 8235 స్క్రిప్టులకు(20 శాతం) సంబంధించి మార్కుల్లో మార్పులొచ్చాయి.
2023లో 61,887 దరఖాస్తులు వస్తే 10987 స్క్రిప్టుల(18 శాతం) మార్కుల్లో మార్పు లు గుర్తించారు. 2025లో 66,363 దరఖాస్తులు వస్తే 11175 స్క్రిప్ట్ల(18 శాతం) మార్కుల్లో మార్పులొచ్చాయి. ఈ ఏడాది మొత్తం మూల్యాంకనం జరిగిన స్క్రిప్టులలో వ్యత్యాసం గమనిస్తే కేవలం 0.006 శాతం మాత్రమే. కానీ వైసీపీ లక్షలాది మంది విద్యార్థుల మనస్సుల్లో అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బ్లూ మీడియాలో అబద్ధాలతో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఈ రాష్ట్రం నాశనమైపోవాలని కోరు కుంటోంది. రాష్ట్రంలో ఏ వ్యవస్థ బాగుండకూడదని వారు ఆశపడుతున్నారని ధ్వజమె త్తారు. ప్రజలు అన్యాయానికి గురైపోవాలి..రాష్ట్రం అధోగతి పాలవ్వాలి..వైసీపీ అధికా రంలోకి రావాలనే లక్ష్యంతోనే బ్లూమీడియా పత్రికలో వార్తలుంటున్నాయని మండిప డ్డారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి వస్తుండటం చాలా దురదృష్టకరం. ప్రజలు వైసీపీ అరాచకాలను గమనించే ఏడాది క్రితం సైకిల్తోనే కొట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు ఛీకొట్టినా ఇంకా బుద్ధి రాదా? అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన స్కాములన్నీ ఒక్కొ క్కటిగా బయటపడుతున్నా సిగ్గు లేదా అని ప్రశ్నించారు. మీ పాపాలను భగవంతుడు చూస్తున్నాడు..అనుభవించక తప్పదదని స్పష్టం చేశారు.